యాప్నగరం

ఏపీ అసెంబ్లీలో వైసీపీ రగడ మొదలు

శుక్రవారం రెండో రోజు ఏపీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.

TNN 9 Sep 2016, 9:44 am
శుక్రవారం రెండో రోజు ఏపీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు లాగే నేడు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు నలుపు రంగుదుస్తులనే ధరించి వచ్చారు. ప్రత్యేక హోదా రానందుకు నిరసనగా వారు నల్లరంగు దుస్తులను ధరించారు. ప్రత్యేక హోదాపై చర్చ కావాలంటూ సమావేశాలు ప్రారంభం కాగానే నినాదాలు చేశారు. వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. పోడియం వద్దే నిల్చుని నిరసన తెలిపారు. రాష్ట్రమంత్రి యనమల రామకృష్ణుడు వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు ప్రకటన చేస్తారని తెలిపారు. అయితే వైసీపీ సభ్యులు ముందు చర్చ చేపట్టి... అనంతరం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. సభాపతి కోడెల శివప్రసాద్ ప్రకటన చేశాకే చర్చ ఉంటుందని స్పష్టం చేశారు. దాంతో నిరసన తెలిపేందుకు సభాపతి వేదిక మీదకు దూసుకెళ్లారు వైసీపీ సభ్యులు. వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. సభాపతి అసెంబ్లీని పది నిమిషాల పాటూ వాయిదా వేశారు.
Samayam Telugu ap assembly started second day
ఏపీ అసెంబ్లీలో వైసీపీ రగడ మొదలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.