యాప్నగరం

ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ప్రతిపక్షమూ టీడీపీనే!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి (నవంబర్ 10) నుంచి ప్రారంభమవుతున్నాయి.

TNN 10 Nov 2017, 9:53 am
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి (నవంబర్ 10) నుంచి ప్రారంభమవుతున్నాయి. ఉదయం 10 గంటలకు ఇటు శాసనసభ, అటు శాసన మండలి సమావేశాలు మొదలవుతాయి. ఈ సమావేశాలను 15 రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం నిర్వహించిన శాసనసభ వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 25 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మరోవైపు ఉభయ సభల్లో ప్రధాన ప్రతిపక్షం లేకుండానే తొలిసారి సమావేశాలు జరగనున్నాయి. అధికార టీడీపీ, మిత్రపక్షం బీజేపీ సభ్యులతోనే సభ నడవనుంది.
Samayam Telugu ap assembly winter session to start from today
ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ప్రతిపక్షమూ టీడీపీనే!


కాగా, అసెంబ్లీ సమావేశాలను ప్రతిపక్ష పార్టీ వైసీపీ బహిష్కరించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘాటుగానే స్పందించారు. ఈ మేరకు గురువారం నిర్వహించిన టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో ప్రతిపక్షంపై నిప్పులు చెరిగారు. తన 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రధాన ప్రతిపక్షం ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడం, శాసనసభను బహిష్కరించడం ఎప్పుడూ చూడలేదని అన్నారు. విపక్షమే లేని అసెంబ్లీని చూడటం ఇదే మొదటిసారని చెప్పారు. శాసనసభ సమావేశాల్లో అధికార, విపక్షాల పాత్రను టీడీపీనే పోషించాలని, నిర్మాణాత్మక ప్రతిపక్షంగానూ వ్యహరించాలని.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చంద్రబాబు సూచించారు.

మొదటి రోజు పట్టిసీమపై చర్చ..
శాసనసభలో ప్రాధాన్యతాంశాలపై చర్చ జరగాలని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. మొదటి రోజు పట్టిసీమపై చర్చిద్దామన్నారు. మనలో మనల్ని పొగుడుకోవడం, సభకు రాని ప్రతిపక్ష సభ్యులపై విమర్శలు చేయడం వంటివి చేయొద్దని పార్టీ సభ్యలకు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.