యాప్నగరం

అమృత్ పథకం అమలులో ఏపీ టాప్.. అవార్డ్ అందుకున్న అధికారులు

అమృత్ పథకం అమలులో ఏపీ సత్తా.. ర్యాంకుల్లో టాప్.. ఢిల్లీలో అవార్డు అందుకున్న అధికారులు

Samayam Telugu 24 Sep 2018, 11:44 pm
కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమృత్ పథకంలో ఏపీ టాప్‌లో నిలిచిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సం ఢిల్లీలో జరిగింది. ఏపీ తరఫున ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణతో పాటూ.. అధికారులు హాజరయ్యారు. ఈ అవార్డును కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరదీప్ సింగ్ పూరీ చేతుల మీదుగా ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ కన్నబాబు అందుకున్నారు.
Samayam Telugu Award


అమృత్ పథకం అమలులో అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు మంత్రి నారాయణ. ఈ అవార్డు మున్సిపల్ శాఖ పనితీరుకు నిదర్శనమని.. సంస్కరణలు, పథకాల అమలులో ఏపీ నంబర్ వన్‌ అన్నారు మంత్రి. రాష్ట్రంలో అన్ని నగరాలు, పట్టణాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. సమయానికి డీపీఆర్‌లు సిద్ధం చేసి.. అధికారుల సమన్వయం చేసుకుంటూ.. కాంట్రాక్టర్ల పనితీరుపై సమీక్షించడం వల్లే పనులు పూర్తయ్యాయంటున్నారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ కన్నబాబు. నిధులకు సంబంధించిన యూసీలు కూడా ఎప్పటికప్పుడు కేంద్రానికి అందజేశామన్నారు. ప్రతి పనికి ఓ టార్గెట్ పెట్టుకొని ముందుకు సాగామన్నారు. అలాగే ఈ అవార్డు రావడంలో మంత్రి నారాయణ మంత్రిగారి సహకారం, ప్రోత్సాహం ఉందన్నారు.

2015లో మోదీ సర్కార్‌ అమృత్‌ పథకం ప్రారంభించింది. పట్టణాల్లో నివసించేవారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం మూడు రకాల సౌకర్యాలను మెరుగుపరచాల్సి ఉంటుంది. ఈ కేటగిరీలో కేంద్రం గత నెలలో విడుదల చేసిన నివాస యోగ్యమైన నగరాల ర్యాంకుల లిస్ట్‌లో టాప్‌లో నిలబడింది. ఆ తర్వాతి స్థానాల్లో ఒడిశా, మధ్య ప్రదేశ్‌ రాష్ట్రాలు నిలిచాయి. వ్యవస్థాగత విభాగంలో తిరుపతి 2, కరీంనగర్‌ 3, హైదరాబాద్‌ 4, విజయవాడ 9, విశాఖ 10 స్థానాల్లో నిలిచాయి. సామాజిక విభాగంలో తిరుపతి 1, విజయవాడ 8 స్థానాల్లో నిలవగా.. ఆర్థిక విభాగంలో విజయవాడ 10వ స్థానంలో నిలిచింది. మౌలికవసతుల పరంగా తిరుపతి 6, విశాఖ 10వ స్థానాల్లో నిలిచాయి.
Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.