యాప్నగరం

పోలవరం పేరుతో చంద్రబాబు 'క్యాట్‌వాక్‌'లు: కన్నా

పోలవరం పేరుతో రాష్ట్రంలో భారీ దోపిడి జరుగుతోంది. పోలవరం పేరుతో ప్రతి సోమవారం చంద్రబాబు క్యాట్‌ వాక్‌లు చేస్తున్నారు.

Samayam Telugu 16 Oct 2018, 7:00 pm
ఆంధ్రప్రదేశ్‌లో దోపిడీ పాలన సాగుతోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. పథకాల పేరుతో టీడీపీ నేతలు అడ్డంగా దోచేస్తున్నారంటూ మండిపడ్డారు. మంగళగిరిలో జరిగిన పార్టీ కార్యాలయం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కన్నా.. చంద్రబాబు, టీడీపీ టార్గెట్‌గా విరుచుకుపడ్డారు. పోలవరం పేరుతో రాష్ట్రంలో భారీ దోపిడి జరుగుతోందన్నారు కన్నా. సబ్ కాంట్రాక్టులతో కమిషన్లు దండుకుంటున్నారంటూ దుయ్యబట్టారు. రాష్ట్రానికి వస్తోన్న నిధులన్నీ జన్మభూమి కమిటీలు నుంచి.. చంద్రబాబు వరకు దోచుకుంటున్నారని విమర్శించారు.
Samayam Telugu Kanna..


పోలవరం నిర్మాణం కోసం కేంద్రం కంకణం కట్టుకుంటే.. టీడీపీ సర్కార్ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు కన్నా. పోలవరం పేరుతో ప్రతి సోమవారం చంద్రబాబు క్యాట్‌ వాక్‌లు చేస్తున్నారని సెటైర్ వేశారు. రాజధానికి రైతులిచ్చిన భూములతో చంద్రబాబు, లోకేష్‌లు వ్యాపారం చేస్తున్నారన్నారు కన్నా. రాజధాని పేరుతో ఇటుకల నుంచి బాండ్ల వరకు అంతా అవినీతి జరిగిందిన్నారు. ఆఖరికి దళిత, గిరిజనుల పేరుతో భూముల్ని దోచుకుంటున్నారని విమర్శించారు.

2014లో కాంగ్రెస్‌ను తిట్టిన చంద్రబాబు.. 2019లో అదే కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారన్నారు లక్ష్మీనారాయణ. అన్నం పెట్టిన చేతిని నరకడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యన్నారు. చంద్రబాబు కుట్రలను తిప్పికొడతామని.. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ఓటమి ఖాయమన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.