యాప్నగరం

మహానాడు కాదు మాయనాడు.. కాంగ్రెస్‌కు బాబు అద్దె మైకు: కన్నా

ఏపీలో ప్రభుత్వ పాలన గాడి తప్పిందన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. గుంటూరులో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఓ పక్కన అవినీతి.. మరోపక్క ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని ఆరోపించారు కన్నా.

Samayam Telugu 28 May 2018, 7:01 pm
Samayam Telugu Kanna Lakshmi Narayana
ఏపీలో ప్రభుత్వ పాలన గాడి తప్పిందన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. గుంటూరులో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఓ పక్కన అవినీతి.. మరోపక్క ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని ఆరోపించారు కన్నా. 'నాలుగేళ్ల పాలనలో ఏం చేశామో కూడా చెప్పుకోలేని స్థితిలో టీడీపీ ఉంది. రాజధాని రైతులకు బాబు అరచేతిలో వైకుంఠం చూపించి.. వారి భూముల్ని రియల్ ఎస్టేట్‌కు అమ్ముకుంటున్నారు. రాష్ట్ర విభజన సమయంలో బాబు డబుల్ గేమ్ ఆడారు.. ఆయన అసమర్థత వల్లే ఏపీకి అన్యాయం జరిగింది' అని విమర్శించారు.

' రెండేళ్ల క్రితం ప్రత్యేక హోదా కంటే ఎక్కువే సాధించామని చంద్రబాబు స్వీట్లు పంచారు. అప్పుడు కేంద్రమంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడును ఊరూరా తిప్పి సన్మానాలు చేశారు. ఇంతలో ఏమయ్యింది. చంద్రబాబు పెద్ద మాయగాడు. ఇప్పుడు విజయవాడలో జరుగుతుంది మహానాడు కాదు.. మాయనాడు. టీడీపీ రెండు సార్లు బీజేపీని వాడుకొని అధికారంలోకి వచ్చింది. అవసరం తీరాక ఆ పార్టీనే దోషిగా నిలబెడుతున్నారు. టీడీపీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా బాబు కాంగ్రెస్‌తో జతకడుతున్నారు.. ఆ పార్టీకి అద్దె మైకులా మారారు. ఇదంతా చూసి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది' అంటూ వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.