యాప్నగరం

బాబు ఓ అపరిచితుడు.. పవన్, జగన్ అంటే భయం: కన్నా

రాష్ట్రానికి ఇచ్చిన ప్రతి పైసా లెక్క చెప్పాల్సిందేనంటున్నారు బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. శ్రీవారి దర్శనార్థం తిరుపతి వచ్చిన ఆయన.. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

Samayam Telugu 30 May 2018, 8:59 pm
రాష్ట్రానికి ఇచ్చిన ప్రతి పైసా లెక్క చెప్పాల్సిందేనంటున్నారు బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. శ్రీవారి దర్శనార్థం తిరుపతి వచ్చిన ఆయన.. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. 'నాలుగేళ్లు మిత్రపక్షంలో ఉంటూ.. ప్రధాని మోదీ ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేయడానికి కుట్రలు చేశారు. హోదా ఇవ్వడం కుదరదని మొదటి నుంచి బాబుకు మొదటి నుంచి చెబుతున్నాం.. ప్యాకేజీ ఇస్తామని కూడా చెప్పాం. అప్పుడు ప్యాకేజీకు ఒకే చెప్పి.. వెంకయ్యనాయుడుని పట్టుకుని బీజేపీకి జై అంటూ ఊరూరా ప్రచారం చేసింది నిజం కాదా. ఇప్పుడు ప్రజల్ని రెచ్చగొడుతున్నారు.. ఇవన్నీ గమనిస్తే చంద్రబాబులో ఓ అపరిచితుడిని చూస్తున్నట్లు ఉంది' అంటూ ఎద్దేవా చేశారు కన్నా.
Samayam Telugu Kanna..


'ఎక్సర్ట్నల్ ఏజెన్సీ నుంచి ప్యాకేజీ నిధులు తెచ్చుకోలేకపోయింది చంద్రబాబు. ఆయన చేతగాని తనాన్ని ప్రశ్నించిన జగన్, పవన్ కళ్యాణ్‌లకు భయపడి మోదీపై ఆరోపణలు చేస్తున్నారు. రాజధానికి కేంద్రం రూ.2,500 కోట్లు ఇచ్చింది. కనీసం మాస్టర్ ప్లాన్ అయినా సిద్ధమయ్యిందా.. డిజైన్ల పేరుతో ఎన్నో దేశాలు తిరిగి చివరికి రాజమౌళి దగ్గరకు వచ్చారు. అమరావతిలో రైతులు నమ్మి భూములు ఇస్తే.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇవన్నీ అడిగితే తిరిగి కేంద్రపైనే విమర్శలు. ఇచ్చి నిధుల లెక్కలేంటి.. చెప్పకపోతే ప్రజల ముందు దోషిగా నిలబెడతాం. అగ్రిగోల్డ్ బాధితులకు అన్యాయం జరుగుతోంది. వాళ్ల ఉసురు కూడా తగులుతుంది. రాష్ట్రంలో ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. పోలీసులతో దాడులు చేయిస్తున్నారు. వారిని అడ్డు పెట్టుకొని ఎన్ని రోజులు ఇలా చేస్తారో చూస్తాం.. అన్నారు లక్ష్మీనారాయణ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.