యాప్నగరం

బుందేల్‌ఖండ్ ప్యాకేజీకి ఏపీ బీజేపీ నేతల మద్దతు!

బీజేపీ నేతలు బుందేల్‌ఖండ్ ప్యాకేజీని సమర్దిస్తూ మరో కొత్త వివాదాన్ని లేపారు.

Samayam Telugu 22 Feb 2018, 12:16 am
‘‘సాయం చేయండి మహా ప్రభో’’ అని మొత్తుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌ను వదిలేసి, కేంద్ర ప్రభుత్వం బుందేల్‌ఖండ్‌కు రూ.20 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. అయితే, ఏపీలోని బీజేపీ నేతలు మాత్రం కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సమర్దిస్తున్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బడ్జెట్‌కు ముందే ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సంగతి తెలిసిందే. అయితే, బడ్జెట్‌లో ఏపీకి ఇచ్చిన హామీలపై ప్రస్తావించకపోగా అరకొర నిధులు కేటాయించారు.
Samayam Telugu ap bjp supports bundelkhand package
బుందేల్‌ఖండ్ ప్యాకేజీకి ఏపీ బీజేపీ నేతల మద్దతు!


దీనిపై ఏపీలో నిరసనలు వ్యక్తమవుతున్న సందర్భంలో మోదీ బుందేల్‌ఖండ్‌కు రూ.20 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. దీంతో ఏపీ నేతల్లో తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే, బీజేపీ నేతలు మాత్రం బుందేల్‌ఖండ్ ప్యాకేజీని సమర్దిస్తూ మరో వివాదాన్ని లేపారు. బుందేల్‌ఖండ్‌లో సామాజిక, రాజకీయ పరిస్థితులు వేరని తెలుపుతున్నారు.

బుందేల్‌ఖండ్‌ ప్యాకేజీపై మంత్రి అచ్చెన్నాయుడు ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ.. ‘‘దేశంలో ఆంధ్రప్రదేశ్ భాగమా? కాదా? అనే అనుమానం కలుగుతోంది. మోదీ బుందేల్‌ఖండ్‌కు రూ.20 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. ఏపీ ప్యాకేజీ ఊసే ఎత్తడంలేదు. ఏపీ ప్రజలు వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నా కేంద్రంలో చలనం లేదు. కేంద్రం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్లు ఉంది’’ అని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.