ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు 2016-17 వార్షిక బడ్జెట్ ను గురువారం శాసనసభలో ప్రవేశపెట్టారు. దాదాపు రెండు గంటల పాటు ఏకధాటిగా ప్రసంగాన్ని సాగించారు. ముగించే ముందు ప్రముఖ ఆంగ్ల రచయిత విల్ ఫ్రెడ్ పీటర్ సన్ వాక్యాలను చదివారు. తెలుగులోకి తర్జుమా చేస్తే ‘తమ శిరసులను మేఘాల్లోనూ, పాదాలను భూమి మీద పెట్టి నడుస్తున్న స్వాప్నికులతో, విశ్వాసభరితులతో, సాహసికులతో, ప్రణాళికావేత్తలతో, విజేతలతో కలిసినడవండి. వారి స్పూర్తి మీలోనూ రగల్చనీయండి. మీరు చూస్తున్న ప్రపంచంకంటే మెరుగైన ప్రపంచ సృష్టికి ప్రయత్నాలు చేయండి’ అని చెప్పి యనమల బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు.
పీటర్సన్ వాక్యాలతో ప్రసంగానికి ముగింపు
ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు 2016-17 వార్షిక బడ్జెట్ ను గురువారం శాసనసభలో ప్రవేశపెట్టారు.
TNN 10 Mar 2016, 3:15 pm