యాప్నగరం

పునర్వ్యవస్థీక‘రణం’: సీఎం సాబ్.. వీరికి చోటేది?

మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణలో కొందరికి ఆనందం కలిగించగా.. మరికొన్ని వర్గాలకు మాత్రం ఖేదం మిగిల్చింది.

TNN 2 Apr 2017, 12:16 pm
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ పూర్తయ్యింది. కొత్త మంత్రుల కొలువుదీరారు. పాత అమాత్యులు కొందరు ఉద్వాసనకు గురయ్యారు. పదవి వచ్చినవారు ఆనందం వ్యక్తం చేస్తుండగా.. రాని వారు అలకల బూనుతున్నారు. రాజీనామా లేఖలతో బెదిరింపులకు దిగుతున్నారు. మరి కొందరేమో మా వైరి వర్గానికి ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.
Samayam Telugu ap cabinet reshuffle no place to sts and minorities
పునర్వ్యవస్థీక‘రణం’: సీఎం సాబ్.. వీరికి చోటేది?


చంద్రబాబు మంత్రి వర్గంలో 26 మంది అమాత్యులు ఉండగా.. సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే.. ఓసీలు 17, బీసీలు, ఎస్సీలు కలిపి 9 మంది. ఎస్టీలు, మైనార్టీలకు మాత్రం ప్రాధాన్యం దక్కలేదు. గణనీయ సంఖ్యలోనే ఉన్నప్పటికీ.. తమ వర్గం నుంచి ఎవరికీ మంత్రి పదవి ఇవ్వలేదంటూ ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సామాజిక వర్గాల సమతూకం పాటించేందుకే ముఖ్యమంత్రి ప్రయత్నించారు. అందులో భాగంగానే బొజ్జల లాంటి సీనియర్ నేతల మంత్రి పదవులు పోయాయి. కానీ ఎస్టీలు, ముస్లింలను ఏ మాత్రం పట్టించుకోకపోవడం మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆశావహులు ఎక్కువ మంది ఉండటం, మంత్రి వర్గంలో బెర్తులు తక్కువగా ఉండటంతో సీఎం కూడా ఏం చేయలేక చేతులెత్తేశారు.

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత అసంతృప్తులు, విమర్శించే వారు ఎక్కువయ్యారు. చంద్రబాబు ఏదోలా కానిచ్చేశారు. ఇప్పుడు కేసీఆర్ వంతు. ఆయనేం చేస్తారో. ఎందుకంటే తెలంగాణ కేబినెట్‌లో ఇప్పటి వరకూ మహిళలకు చోటు దక్కలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.