యాప్నగరం

ఏప్రిల్ 2న ఏపీ కేబినేట్ పునర్వ్యస్థీకరణ

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణకు ముహుర్తం ఖరారైంది. ఏప్రిల్ 2న ఉదయం 9గంటలకు అమరావతి సచివాలయంలో

Samayam Telugu 30 Mar 2017, 7:34 pm
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణకు ముహుర్తం ఖరారైంది. ఏప్రిల్ 2న ఉదయం 9గంటలకు అమరావతి సచివాలయంలో మంత్రివర్గ విస్తరణ జరుగనుంది. ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీగా సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఆయనకు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కనుంది. లోకేష్ ఐటీ, పంచాయత్ రాజ్ శాఖలు కేటాయించనున్నట్లు సమాచారం. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన భూమా అఖిల ప్రియను మంత్రి పదవి వరించనుంది.
Samayam Telugu ap cabinet reshuffling on april 2nd lokesh to be minister
ఏప్రిల్ 2న ఏపీ కేబినేట్ పునర్వ్యస్థీకరణ


ఇదిలా ఉండగా ప్రస్తుత మంత్రుల్లో ఐదుగురికి ఉద్వాసన ఉండనున్నట్లు తెలుస్తోంది. ఏడుగురికి ఈసారి విస్తవరణలో ఛాన్స్ దక్కనుంది. పలువురి మంత్రుల శాఖలు కూడా మారనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం 20 మంది మంత్రులున్న ఏపీ కేబినేట్.. ఆ సంఖ్యను 26కు పెంచుకునే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.