యాప్నగరం

2018లో అన్నా క్యాంటీన్లు ప్రారంభం

నామమాత్రపు ధరతో నిరుపేదలకు ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత 2013లో అమ్మ క్యాంటీన్లు ప్రారంభించారు.

TNN 27 Nov 2017, 5:00 pm
నామమాత్రపు ధరతో నిరుపేదలకు ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత 2013లో అమ్మ క్యాంటీన్లు ప్రారంభించారు. అలాగే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతి కుటుంబానికి రోజుకు 20 లీటర్ల శుద్ధిచేసిన జలాలను ఉచితంగా అందించే పథకాన్ని కూడా జయలలిత అమలు చేశారు. ఈ రెండు పథకాలకు విస్తృత ప్రజాదరణ లభిస్తోంది. ఈ క్యాంటీన్లు విజయవంతం కావడంతో ఇతరు రాష్ట్రాలు కూడా వీటిని ప్రారంభించడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే కర్ణాటకలో ఇందిర క్యాంటిన్ పేరుతో వీటిని ప్రారంభించారు. అమ్మ క్యాంటీన్‌ను స్ఫూర్తిగా తీసుకుని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ కూడా వీటిని ప్రారంభించింది.
Samayam Telugu ap cm announces anna canteens will started soon
2018లో అన్నా క్యాంటీన్లు ప్రారంభం


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి క్యాంటీన్లను ప్రారంభించనుంది. ఇప్పటికే తమిళనాడులో పర్యటించిన ఏపీ మంత్రులు ఈ పథకంపై అధ్యయనం చేశారు. తమ రాష్ట్రంలో 200 అన్నా క్యాంటీన్లను తొలిదశలో ప్రారంభించనున్నట్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్రకటించారు. సోమవారం అసెంబ్లీలో ఆయ‌న మాట్లాడుతూ... కొత్త ఏడాది 2018 ఆరంభంలో అన్నా క్యాంటీన్లను పూర్తి స్థాయిలో ప్రారంభిస్తామ‌ని తెలిపారు. డ్వాక్రా సంఘాల ద్వారా ప్ర‌తి కుటుంబానికి నెల‌కు రూ.10 వేల ఆదాయం వ‌చ్చేలా చూస్తామ‌ని అన్నారు. జ‌న‌వ‌రి 1 నుంచి పెళ్లి కానుక కింద పేద‌ల‌కు రూ.30 వేలు ఆర్థిక సాయం అందజేస్తామ‌ని తెలియజేశారు.

త్వ‌ర‌లో హిజ్రాల‌కు కూడా రూ.1,000 చొప్పున పింఛ‌న్లు ఇస్తామ‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. చ‌దువు, ఆరోగ్యం, వివాహాల వల్ల పేద‌ల ఖ‌ర్చులు పెరుగుతున్నాయని, ఇదే సమయంలో వారి ఆదాయం కూడా పెర‌గాల్సి ఉంద‌ని అన్నారు. చంద్ర‌న్న బీమా ద్వారా స‌హ‌జ మ‌ర‌ణ‌మైనా రూ.2 ల‌క్ష‌ల బీమా అందిస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో నాణ్య‌మైన విద్యను అందించ‌డానికి కృషి చేస్తున్నామ‌ని పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.