లక్ష్మీ ప్రసన్నకు గ్రూప్-2 ఉద్యోగం..
తండ్రి ఆవేశం కారణంగా మొత్తం కుటుంబాన్నే కోల్పోయిన విద్యార్థినికి అండగా నిలుస్తూ..
TNN 11 Jul 2017, 8:43 pm
తండ్రి ఆవేశం కారణంగా మొత్తం కుటుంబాన్నే కోల్పోయిన విద్యార్థినికి అండగా నిలుస్తూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన యువతి లక్ష్మీ ప్రసన్నకు గ్రూప్-2 ఉద్యోగం ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. సీఎం సూచన మేరకు జేసీ సోదరులు మంగళవారం (జులై 11) వెలగపూడిలోని సచివాలయానికి లక్ష్మీ ప్రసన్నను తీసుకొచ్చారు. చంద్రబాబు ఆమె విద్యార్హతలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివిన లక్ష్మీ ప్రసన్నకు గ్రూప్-2 ఉద్యోగం ఇవ్వాలని అప్పటికప్పుడే నిర్ణయించారు.
జులై 5న అనంతపురం జిల్లా ముక్తాపురం గ్రామసభలో లక్ష్మీ ప్రసన్నకు అండగా నిలుస్తామని ధైర్యం చెప్పిన సీఎం రూ. 20 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమెను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించిన చంద్రబాబు లక్ష్మీ ప్రసన్న బాగోగులు చూసుకుంటానని, ఉన్నత చదువులు చదివిస్తానని హామీ ఇచ్చారు.
ప్రభుత్వ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా అండగా నిలుస్తానని, ఉద్యోగం వచ్చినా ఎంత వరకు చదివితే అంతవరకు చదువుకోడానికి అవకాశం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. గ్రూప్-2 ఉద్యోగంతో సరిపుచ్చుకోకుండా ఉన్నత స్థాయికి చేరుకోవాలని, ఆరు నెలలకు ఓసారి వచ్చి తనను కలవాలని లక్ష్మీ ప్రసన్నకు సూచించారు.
కూతుళ్లను చదివించడం భారంగా భావించిన అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన రామసుబ్బారెడ్డి.. జులై 4న తన భార్య, ఇద్దరు కుమార్తెలను అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి పెద్ద కుమార్తె లక్ష్మీ ప్రసన్నకు తిరుపతి ఐఐఎంలో సీటు రావడంతో.. అద్దె ఇల్లు వెతుక్కోవడానికి అక్కడికి వెళ్లింది. ఇల్లు వెంటనే దొరక్కపోవడంతో ఇంటికి తిరిగి రాలేదు. లేకపోతే తండ్రి దాష్టీకానికి ఆమె కూడా బలయ్యేది.
జులై 5న అనంతపురం జిల్లా ముక్తాపురం గ్రామసభలో లక్ష్మీ ప్రసన్నకు అండగా నిలుస్తామని ధైర్యం చెప్పిన సీఎం రూ. 20 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమెను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించిన చంద్రబాబు లక్ష్మీ ప్రసన్న బాగోగులు చూసుకుంటానని, ఉన్నత చదువులు చదివిస్తానని హామీ ఇచ్చారు.
ప్రభుత్వ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా అండగా నిలుస్తానని, ఉద్యోగం వచ్చినా ఎంత వరకు చదివితే అంతవరకు చదువుకోడానికి అవకాశం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. గ్రూప్-2 ఉద్యోగంతో సరిపుచ్చుకోకుండా ఉన్నత స్థాయికి చేరుకోవాలని, ఆరు నెలలకు ఓసారి వచ్చి తనను కలవాలని లక్ష్మీ ప్రసన్నకు సూచించారు.
కూతుళ్లను చదివించడం భారంగా భావించిన అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన రామసుబ్బారెడ్డి.. జులై 4న తన భార్య, ఇద్దరు కుమార్తెలను అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి పెద్ద కుమార్తె లక్ష్మీ ప్రసన్నకు తిరుపతి ఐఐఎంలో సీటు రావడంతో.. అద్దె ఇల్లు వెతుక్కోవడానికి అక్కడికి వెళ్లింది. ఇల్లు వెంటనే దొరక్కపోవడంతో ఇంటికి తిరిగి రాలేదు. లేకపోతే తండ్రి దాష్టీకానికి ఆమె కూడా బలయ్యేది.