యాప్నగరం

జ్యూడిషియల్ విచారణకు మేం సిద్దం: ఏపీ సీఎం

అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఏపీ అసెంబ్లీలో జగన్ చేసిన ఆరోపణలపై ఏసీ సీఎం చంద్రబాబు చాలా ధీటుగా స్పందించారు.

TNN 23 Mar 2017, 3:07 pm
అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఏపీ అసెంబ్లీలో జగన్ చేసిన ఆరోపణలపై ఏసీ సీఎం చంద్రబాబు చాలా ధీటుగా స్పందించారు. జగన్ కోరినట్టు తాము మంత్రి ప్రత్తిపాటిపై జ్యూడిషియల్ విచారణకు సిద్ధమని ప్రకటించారు. అయితే ప్రత్తిపాటి విసిరిన సవాల్ ను జగన్ స్వీకరించాలని సూచించారు. విచారణలో జగన్ ఆరోపణలు నిజమని తేలితే పుల్లారావుని సభ నుంచి బహిష్కరిస్తామని, అవి కేవలం అసత్య ఆరోపణలని తేలితే జగన్ సభ నుంచి వైదొలగాలని అన్నారు. నచ్చినట్టుగా ఆరోపణలు చేస్తుంటే చూస్తూ ఊరుకోమని తెలిపారు. సభలో జగన్ లేదా పుల్లారావు ఒకరే ఉండాలని... సవాల్ స్వీకరిస్తారా అని జగన్ ను ఉద్దేశించి అన్నారు. దీనిపై వెంటనే జగన్ స్పందించాలని కోరారు.
Samayam Telugu ap cm chandrababu fires on jagan over agrigold issue
జ్యూడిషియల్ విచారణకు మేం సిద్దం: ఏపీ సీఎం


జాతీయ మహిళా పార్లమెంటేరియన్ సదస్సులో కూడా స్పీకర్ కోడెల మాట్లాడిన మాటల్నీ వక్రీకరించి తమ పత్రికలో రాసుకున్నారని, సభాపతి పై కూడా అసత్య ఆరోపణలు చేస్తుంటే చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. అయితే అధికార పార్టీ విసిరిన సవాల్ పై సరిగా స్పందించకుండానే వైకాపా వాకౌట్ చేసి సభ నుంచి వెళ్లిపోయింది. అనంతరం స్పీకర్ కోడెల మహిళా పార్లమెంటేరియన్ సదస్సులో ఏం మాట్లాడారో ఆ క్లిప్ ను సభలో ప్రదర్శించారు. అనంతరం ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.