యాప్నగరం

నీతి ఆయోగ్‌లో ఇంట్రస్టింగ్ సీన్

ఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ సమావేశంలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం జరిగింది. బీజేపీపై కత్తుల దూస్తున్న సీఎంలు, ప్రధాని మోదీ కలవడం హాట్‌టాపిక్ అయ్యింది.

Samayam Telugu 17 Jun 2018, 4:57 pm
ఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ సమావేశంలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం జరిగింది. బీజేపీపై కత్తుల దూస్తున్న సీఎంలు, ప్రధాని మోదీ కలవడం హాట్‌టాపిక్ అయ్యింది. రాష్ట్రపతి భవన్‌లో ఈ భేటీ జరగ్గా.. ఏపీ సీఎం చంద్రబాబు, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి.. పశ్చిమబెంగాల్, కేరళ సీఎంలు మమతా బెనర్జీ, పినరయి విజయన్‌లు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ కూడా అటువైపుగా వచ్చారు. ముఖ్యమంత్రుల్ని చూసి ఆగారు. వారి దగ్గరకు వెళ్లారు. ఏపీ, కర్ణాటక, కేరళ సీఎంలకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. మమతను కూడా పలకరించారు.
Samayam Telugu Babu Hand Shake


ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగిన తర్వాత మొదటిసారి చంద్రబాబు-మోదీలు ఎదురుపడగా.. ఇద్దరు ముసి, ముసి నవ్వులు నవ్వుకుంటూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. అంతేకాదు మోదీ కూడా చొరవ తీసుకొని.. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న సీఎంల దగ్గరికి వెళ్లి పలకరించడం కూడా చర్చనీయాంశంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.