యాప్నగరం

దేశంలో తెలివికి కొదవ లేదు: వెంకయ్య

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి శనివారం (జులై 15) నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయాన్ని..

TNN 15 Jul 2017, 2:08 pm
భారత దేశం విద్యకు ప్రాధాన్యం ఇస్తోందని.. దేశంలో తెలివికి కొదవలేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి శనివారం (జులై 15) నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. వర్సిటీ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. నవ్యాంధ్ర రాజధానిలో తొలి ప్రైవేట్ వర్సిటీ ఏర్పాటుకావడం ఎంతో సంతోషం కలిగిస్తోందని, సీఎం చంద్రబాబు రాజధానిని అన్ని హంగులతో తీర్చిదిద్దుతున్నారని అన్నారు. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఎక్కడికెళ్లినా తిరిగి రావాలని, దేశాన్ని పూజించాలని ఆయన కోరారు. దేశాన్ని శక్తిమంతంగా తయారు చేసుకోవాల్సిన బాధ్యత యువతపైనే ఉందన్నారు.
Samayam Telugu ap cm chandrababu inaugurates srm university amaravati campus
దేశంలో తెలివికి కొదవ లేదు: వెంకయ్య


అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు కేంద్ర ప్రభుత్వం తరఫున వెంకయ్య అభినందనలు తెలిపారు. రైతులకు పూర్తిగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. చరిత్రలో అమరావతి రైతుల పేరు సువర్ణాక్షరాలతో నిలిచి పోతాయని ఆయన పేర్కొన్నారు. విదేశాల నుంచి కూడా ఇక్కడి వర్సిటీకి విద్యార్థులు వచ్చి చదువుతారనే విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్య, సీఎం చంద్రబాబు యూనివర్సిటీ క్యాంపస్‌లో మొక్కలు నాటారు. ఈ వర్సిటీలో ఆగస్టు 7 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది విశ్వవిద్యాలయంలో 240 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు. మంగళగిరి మండలం నీరుకొండ వద్ద ఈ విశ్వవిద్యాలయాన్ని నిర్మించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.