యాప్నగరం

ఢిల్లీకి బయల్దేరిన చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబుకు ఢిల్లీ వెళ్లారు. ఉండవల్లిలో తన నివాసం నుంచి నేరుగా బెజవాడ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఢిల్లీకి బయల్దేరారు. ఈ హస్తిన పర్యటనలో భాగంగా.. లోక్‌సభలో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి మద్దతు తెలిపిన పార్టీలకు బాబు కృతజ్ఞతలు తెలపుతారు.

Samayam Telugu 21 Jul 2018, 11:05 am
ఏపీ సీఎం చంద్రబాబుకు ఢిల్లీ వెళ్లారు. ఉండవల్లిలో తన నివాసం నుంచి నేరుగా బెజవాడ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఢిల్లీకి బయల్దేరారు. ఈ హస్తిన పర్యటనలో భాగంగా.. లోక్‌సభలో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి మద్దతు తెలిపిన పార్టీలకు బాబు కృతజ్ఞతలు తెలపుతారు. అలాగే భవిష్యత్ కార్యాచరణతో పాటూ.. ఏపీకి జరిగిన అన్యాయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లనున్నారు. అనంతరం అవిశ్వాసంతో పాటూ పలు కీలక అంశాలపై ఢిల్లీలోనే మీడియాతో మాట్లాడతారని పార్టీ వర్గాలంటున్నాయి.
Samayam Telugu Cm Babu


లోక్‌సభలో అవిశ్వాసంపై మోదీ ప్రసంగం తర్వాత కూడా చంద్రబాబు స్పందించారు. కేంద్రం అధికారం ఉందనే అహంకారంతో ఉన్నారు. ప్రధాని కూడా అలాగే మాట్లాడారు. ప్రజల మనోభావాలతో ఆడుకుంటూ మళ్లీ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించారని మండిపడ్డారు. కాంగ్రెస్ అన్యాయం చేసిందన్న బీజేపీ.. ఇప్పుడు ఏం న్యాయం చేసిందని ప్రశ్నించారు. తాను మొదటి నుంచి విభజనతో ఏపీకి అన్యాయం జరిగిందని అంటూనే ఉన్నా.. ఎవరూ పట్టించుకోలేదు. నాలుగేళ్లుగా న్యాయం చేస్తారని ఆశతో ఎదురుచూశాం.. ఇక విసిగిపోయి అవిశ్వాసంం పెడితే అబద్దాలు చెబుతున్నారు. తనపై కోపం ఉండొచ్చు. కాని ఏపీ ప్రజలపై కక్ష సాధించడం దారుణమన్నారు బాబు. అందుకే కేంద్రంపై ఒత్తిడి తెచ్చే దిశగా.. ఢిల్లీ వేదికగా మరోసారి గళం విప్పే ప్రయత్నం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.