యాప్నగరం

గవర్నర్‌తో బాబు అత్యవసర సమావేశం!

గవర్నర్‌ నరసింహన్‌తో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం విజయవాడలో భేటీ అయ్యారు. శనివారం విశాఖలో జరిగిన రెడ్‌క్రాస్‌ సొసైటీ రాష్ట్ర వార్షిక సర్వసభ్య సమావేశానికి నరసింహన్ హజరయ్యారు.

Samayam Telugu 22 Apr 2018, 1:05 pm
గవర్నర్‌ నరసింహన్‌తో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం విజయవాడలో భేటీ అయ్యారు. శనివారం విశాఖలో జరిగిన రెడ్‌క్రాస్‌ సొసైటీ రాష్ట్ర వార్షిక సర్వసభ్య సమావేశానికి నరసింహన్ హజరయ్యారు. అనంతరం విశాఖ పర్యటన ముగించుకుని నేరుగా హైదరాబాద్‌ చేరుకోవాల్సి ఉన్నా చివరి నిమిషంలో మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో శనివారం సాయంత్రం గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో విశాఖ నుంచి విజయవాడ చేరుకున్నారు. విజయవాడలోని గేట్‌ వే హోటల్‌లో బసచేసిన గవర్నర్‌ను కలిసిన చంద్రబాబు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సన్మానించారు. అనంతరం ఇరువూరు ఏకాంతంగా సమావేశమై రాష్ట్రంలో తాజా పరిస్థితుల గురించి చర్చించారు.
Samayam Telugu గవర్నర్‌తో ఏపీ సీఎం భేటీ


ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్రం చేస్తోన్న అన్యాయానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 20న చంద్రబాబు తన పుట్టిన రోజు నాడు చేపట్టిన ధర్మపోరాట దీక్ష సహా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై గవర్నర్‌తో చర్చించినట్లు సమాచారం. ఏపీలో పరిస్థితులను ఇటీవల కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు పరిశీలించాయి. ఈ క్రమంలో గవర్నర్‌తో చంద్రబాబు సుమారు అరగంట పాటు చర్చించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. విభజన చట్టంలో వివిధ అంశాల గురించి గవర్నర్‌తో చర్చించినట్టు తెలుస్తోంది. మరోసారి గవర్నర్ ద్వారా కేంద్రానికి తమ డిమాండ్లను తెలియజేయనున్నట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.