యాప్నగరం

బాబు ఢిల్లీ టూర్: శరద్ యాదవ్, కెజ్రీలతో భేటీ

శనివారం ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. శరద్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశారు. ఈ సందర్భంగా కీలక విషయాలపై చర్చలు జరిపారు.

Samayam Telugu 27 Oct 2018, 3:02 pm
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు శనివారం ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా లోక్‌తంత్రిక్ జనతాదళ్ వ్యవస్థాపకుడు శరద్ యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కెజ్రీవాల్‌తో ఆయన ఏపీ భవన్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర ప్రభుత్వం తీరును వారికి వివరించారు.
Samayam Telugu Untitleda


ఈ భేటీలో జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా కూడా పాల్గొన్నట్లు తెలిసింది. అనంతరం ఢిల్లీ పర్యటనపై ఏపీభవన్‌లో జరిగే విలేకరుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడతారు. రాష్ట్ర విభజన చట్టం అమలు చేయకుండా కేంద్రం ఏపీని కేంద్రం ఇబ్బందులకు గురిచేస్తుండటం, టీడీపీ లక్ష్యంగా జరుగుతున్న ఐటీ దాడులు, రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు గురించి చంద్రబాబు చర్చించినట్లు తెలిసింది. సీబీఐ, రాఫేల్‌ కుంభకోణాలు తదితర అంశాలను జాతీయ మీడియాకు వివరించనున్నారు. ఈ సందర్భంగా ‘డెమోక్రసీ ఇన్‌ డేంజర్‌.. టార్గెట్‌ ఏపీ’ పేరుతో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ కూడా ఇవ్వనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.