కేంద్రంపై పోరును ఉధృతం చేసే పనిలో ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విభజన హామీలను నెరవేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టేందుకు బాబు పావులు కదుపుతున్నారు. దీని కోసం ఢిల్లీ వెళ్లేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ నెల 3,4 తేదీల్లో హస్తినలో పర్యటించనున్నారు. టూర్లో జాతీయ నేతల్ని చంద్రబాబు కలవనున్నారు. ఏపీలో పరిస్థితులు, విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన నిధుల గురించి వారికి వివరించనున్నారు. బాబు వెంట పలువురు మంత్రులు, ముఖ్య నేతలు కూడా వెళతారని తెలుస్తోంది.
వాస్తవానికి చంద్రబాబు ఈ నెల 2,3 తేదీల్లో వెళ్లాలని భావించినా... కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఉండటంతో వాయిదా వేశారు. అంతేకాదు ఢిల్లీ వెళ్లాలా వద్దా అనే సందిగ్థం కూడా కొనసాగింది. పార్టీలో కొందరు నేతలు హస్తినకు వెళ్లాలని సూచించగా... మరికొందరు మాత్రం తొందరపాటు వద్దన్నారట. అందుకే టూర్పై డైలమా కొనసాగింది. కాని చివరికి వెళ్లాలనే చంద్రబాబు డిసైడ్ అయ్యారట.
వాస్తవానికి చంద్రబాబు ఈ నెల 2,3 తేదీల్లో వెళ్లాలని భావించినా... కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఉండటంతో వాయిదా వేశారు. అంతేకాదు ఢిల్లీ వెళ్లాలా వద్దా అనే సందిగ్థం కూడా కొనసాగింది. పార్టీలో కొందరు నేతలు హస్తినకు వెళ్లాలని సూచించగా... మరికొందరు మాత్రం తొందరపాటు వద్దన్నారట. అందుకే టూర్పై డైలమా కొనసాగింది. కాని చివరికి వెళ్లాలనే చంద్రబాబు డిసైడ్ అయ్యారట.