యాప్నగరం

నారావారిపల్లెలో సీఎం సంక్రాంతి సంబరాలు

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని తన సొంతూరు నారావారిపల్లెలో శనివారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు హాజరయ్యారు.

TNN 14 Jan 2018, 10:12 am
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని తన సొంతూరు నారావారిపల్లెలో శనివారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు హాజరయ్యారు. ఈ వేడుకల్లో సీఎం సతీమణి నారా భువనేశ్వరితోపాటు లోకేష్‌, హిందూపురం నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులు నారావారిపల్లె చేరుకున్నారు. మూడు రోజులపాటు గ్రామంలో బంధువులు, ఆత్మీయులతో సంక్రాంతి సంబరాలు నిర్వహించుకోనున్నారు.
Samayam Telugu ap cm chandrababu naidu family celebrates sankranthi at naravaripalli
నారావారిపల్లెలో సీఎం సంక్రాంతి సంబరాలు


ఈ సందర్భంగా శనివారం నారావారిపల్లె చేరుకున్న చంద్రబాబు.. ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులతో సంక్రాంతి పడుగను జరుపుకోవాలని అభిమానులకు, నాయకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

భోగి మంటల కాంతులు ప్రతి ఒక్కరి జీవితాల్లో భోగభాగ్యాలు నింపాలని, సంస్కృతి సంప్రదాయాలను మరువక అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఈ పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. — N Chandrababu Naidu (@ncbn) January 14, 2018
సంక్రాంతి సంబరాల్లో భాగంగా టీటీడీ కల్యాణ మండపంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలకు నారా భువనేశ్వరి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేశారు. మనం ఎక్కడున్నా మన సాంప్రదాయాలను మరిచిపోకూడదని, మన పండుగలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనపైనే ఉందని అందుకే ప్రతి ఏడాది నారావారిపల్లెలో సంక్రాంతి పండుగను జరుపుకుంటామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.