యాప్నగరం

సహనానికి పరీక్ష పెట్టొద్దు.. చింతమనేనికి సీఎం వార్నింగ్

ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు.

Samayam Telugu 17 Nov 2018, 1:38 pm
హనానికి పరీక్ష పెడితే ఉపేక్షించేది లేదంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతమనేని అనుచరులు గద్దె కిషోర్ తదితరులు గార్లమడుగు మాజీ సర్పంచి సాంబ శివ కృష్ణారావుపై దాడి చేసిన ఘటనను పలువురు సీనియర్ నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
Samayam Telugu Untitled1211


ఒకరు చేసే తప్పుకు పార్టీ మొత్తం సమాధానం చెప్పుకోవల్సి వస్తుందని ముఖ్యమంత్రికి తెలిపారు. దీనిపై స్పందించిన చంద్రబాబు.. ఎన్నిసార్లు చెప్పినా చింతమనేని తీరు మారడం లేదని, పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. కేవలం పనిచేస్తే సరిపోదని, పద్ధతిగా ఉంటనే పార్టీలో భవిష్యత్తు ఉంటుందన్నారు. తన సహనానికి పరీక్ష పెడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.