యాప్నగరం

డీఎన్ఏ ఇండెక్స్ సిస్టమ్‌తో నేరాలకు చెక్

వరుస నేరాలకు పాల్పడే వారిని పట్టుకునేందుకు ఉపకరించే డీఎన్‌ ఇండెక్స్ సిస్టమ్‌ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రారంభించారు..

TNN 20 Aug 2016, 4:42 pm
వరుస నేరాలకు పాల్పడుతూ పోలీసులకు తలనొప్పిగా మారిన నేరగాళ్లకు ఇక గడ్డు రోజులు రాబోతున్నాయి. ఒకసారి నేరం చేసి పట్టుబడినవారు నేరాలు, దోపిడీలను ఆపేయాల్సిందే. అలా కాదని మరోసారి నేరానికి ప్రయత్నిస్తే ఇక అడ్డంగా దొరికిపోవడం ఖాయం. ఎందుకిలా అంటున్నామంటే.. నేరగాళ్ల ఆట కట్టించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎన్‌ఏ ఇండెక్స్ సిస్టమ్‌ను ప్రారంభించింది. ఈ వ్యవస్థ ద్వారా నేరగాళ్ల డీఎన్‌ఏను విశ్లేషించడానికి పోలీసులకు సులవవుతుంది. నేరానికి పాల్పడిన వ్యక్తుల డీఎన్‌ఏను సేకరించి పోలీసులు తమ రికార్డుల్లో భద్రపరుస్తారు. ఏదైనా కొత్త నేరం జరిగితే అక్కడ లభించిన డీఎన్‌ఏను తమ రికార్డుల్లోని డీఎన్‌ఏతో పోలీసులు పోల్చి చూస్తారు. తద్వారా నేర ప్రవృత్తి గల వ్యక్తి ఎవరైనా మరోమారు నేరానికి పాల్పడితే సులువుగా పట్టుబడతాడు. దీంతో సీరియల్ దొంగతనాలకు ఇక చెక్ పడనుంది. నేరగాళ్ల డీఎన్ఏ ఇండెక్స్ సిస్టమ్‌ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం విజయవాడలో ప్రారంభించగా, ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, డీజీపీ సాంబశివరావు హాజరయ్యారు.
Samayam Telugu ap cm chandrababu naidu launched dna index system
డీఎన్ఏ ఇండెక్స్ సిస్టమ్‌తో నేరాలకు చెక్


Launched the DNA Index System today which will enable the Police to analyse DNA profiles of criminals &solve crimes. pic.twitter.com/MXoOip5CIC — N Chandrababu Naidu (@ncbn) August 20, 2016

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.