యాప్నగరం

ఉచిత విద్యుత్‌ పథకాన్ని దెబ్బ తీస్తారా..మోదీకి బాబు లేఖాస్త్రం

ప్రధాని మోదీకి లేఖాస్త్రాన్ని సంధించారు సీఎం చంద్రబాబు. 15వ ఆర్థిక సంఘం విధి విధానాల్లో... జనాకర్షక పథకాలపై సమీక్ష అనే అంశాన్ని చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

Samayam Telugu 7 May 2018, 12:16 pm
ప్రధాని మోదీకి లేఖాస్త్రాన్ని సంధించారు సీఎం చంద్రబాబు. 15వ ఆర్థిక సంఘం విధి విధానాల్లో... జనాకర్షక పథకాలపై సమీక్ష అనే అంశాన్ని చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతుల్ని ఆదుకునేందుకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నామని... దాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ప్రస్తావించారు. విద్యుత్ చట్టం-2013కి సవరణలు చేయాలనే ప్రతిపాదనల్ని కూడా విరమించుకోవాలని... ఇది రాష్ట్రాలు ఉచిత విద్యుత్ ఇవ్వకుండా కేంద్రం ఒత్తిడి తెచ్చేలా ఉందని అభిప్రాయపడ్డారు చంద్రబాబు.
Samayam Telugu Babu Modi


ఏపీలో వరి సాగు ఖర్చు హెక్టారుకు 1.08లక్షలు అవుతోందని... క్వింటాలుకు 1702 రూపాయలు సాగు ఖర్చు అవుతుందని వివరించారు సీఎం.వరితో పాటూ అన్ని పంటలకు మద్దతు ధర నిర్ణయించే విధానం రైతుకు మేలు చేసేలా ఉండాలని సీఎం లేఖలో పేర్కొన్నారు. సాగు ఖర్చు రూపాయి అయితే మద్దతు ధర 83 పైసలుగా ఉండటాన్ని తప్పుబట్టారు. పంటల బీమా నిబంధనల్లో మార్పులు అవసరమన్నారు చంద్రబాబు. రైతులు తమ దగ్గర తీసుకున్న రుణాల వివరాలను జాతీయ పంట బీమా పోర్టల్‌లో నమోదు చేయాలని బ్యాంకులకు విధించిన నిబంధనతో అనేక ఇబ్బందులు వస్తున్నాయని చంద్రబాబు ప్రధాని దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.