యాప్నగరం

కేసీఆర్ మోదీకి బ్రీఫింగ్ ఇస్తున్నారా.. చంద్రబాబు సెటైర్

ఫెడరల్ ఫ్రంట్ పేరుతో వివిధ పార్టీలకు చెందిన నేతలను కలిసిన కేసీఆర్.. ఇప్పుడు ప్రధానిని కలుస్తున్నారు. మోదీకి బ్రీఫింగ్ చేయడానికి వెళ్తున్నారా.. లేక రాష్ట్ర సమస్యలు చెప్పడానికి వెళ్తున్నారా.

Samayam Telugu 26 Dec 2018, 3:39 pm

ప్రధానాంశాలు:

  • కేసీఆర్ మోదీని ఎందుకు కలుస్తున్నట్లు
  • మోదీకి బ్రీఫింగ్ చేయడానికి వెళ్తున్నారా
  • రాష్ట్ర సమస్యల్ని చెప్పబోతున్నారా
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu babbu on kc
ఫెడరల్ ఫ్రంట్ పేరు చెప్పే కేసీఆర్.. ప్రధాని మోదీని కలవడం వెనుక అర్థమేంటని ప్రశ్నించారు ఏపీ సీఎం చంద్రబాబు. ‘ఫెడరల్ ఫ్రంట్ పేరుతో వివిధ పార్టీలకు చెందిన నేతలను కలిసిన కేసీఆర్.. ఇప్పుడు ప్రధానిని కలుస్తున్నారు. మోదీకి బ్రీఫింగ్ చేయడానికి వెళ్తున్నారా.. లేక రాష్ట్ర సమస్యలు చెప్పడానికి వెళ్తున్నారా’అంటూ సెటైర్లు పేల్చారు. ఒక మాట చెప్పడం వేరని.. చేసే పనులు మరోరకంగా ఉంటాయని చంద్రబాబు అన్నారు. బుధవారం అమరావతిలో నాలుగో శ్వేతపత్రం విడుదల చేశాక.. మోదీ-కేసీఆర్ భేటీపై మీడియా ప్రస్తావించగా బాబు స్పందించారు.
ఫెడర్ ఫ్రంట్ లక్ష్యంగా దూకుడు పెంచిన తెలంగాణ సీఎం కేసీఆర్.. వరుస పర్యటనలతో జాతీయ స్థాయి నేతల్ని కలుస్తున్నారు. ఒడిశా, పశ్చిమ్‌ బెంగాల్ ముఖ్యమంత్రులను కలిసి ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై చర్చించారు. తమతో కలిసి రావాలని.. ఫ్రంట్‌కు సహకరించాలని కోరారు. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు. బుధవారం కేసీఆర్ ప్రధానిని కలవబోతున్నారు. ఈ భేటీపైనే చంద్రబాబు స్పందించారు.. కేసీఆర్‌పై సెటైర్లు పేల్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.