యాప్నగరం

సైన్సుకు కూడా దేవుని కృప అవసరం: చంద్రబాబు

సైన్సుకు కూడా దేవుని దయ, కృప అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

TNN 3 Jan 2017, 1:22 pm
సైన్సుకు కూడా దేవుని దయ, కృప అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మంగళవారం ప్రారంభమైన 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సులో ఆయన ప్రసంగించారు. భారత్‌లో ఆధ్యాత్మిక కేంద్రాల్లో తిరుపతి ఒకటని, శ్రీవేంకటేశ్వరుని పాదాల చెంత నేడు సైన్స్ కాంగ్రెస్ నిర్వహించుకోవడం ఆనందదాయకమని చంద్రబాబు అన్నారు. ఆల్జీబ్రా, కంప్యూటర్‌ బైనరీకోడ్‌లో వాడుతున్న జీరోను భారత శాస్త్రవేత్త కనిపెట్టడం ఎంతో గర్వకారణమని సీఎం తెలిపారు.
Samayam Telugu ap cm chandrababu naidu speach at 104th science congress in tirupathi
సైన్సుకు కూడా దేవుని కృప అవసరం: చంద్రబాబు


దేశంలో ఆర్థిక సంస్కరణల్లో భాగంగా ప్రధాన మంత్రి రెండు అతిపెద్ద నిర్ణయాలు తీసుకున్నారని.. ఒకటి రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేయడం, రెండు జీఎస్టీ బిల్లును తీసుకురావడమని చంద్రబాబు చెప్పారు. నోట్ల రద్దు వల్ల సామాన్యుడికి లాభం కలుగుతుందని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయంతో రాజకీయ అవినీతిని కూడా నియంత్రించొచ్చని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదులు, అవినీతిపరులకు నోట్ల రద్దు నిర్ణయం పెద్ద దెబ్బ అన్నారు. ఆర్థిక రంగంలో ప్రధాని మోదీ విప్లవాత్మక మార్పులు తెస్తున్నారని కొనియాడారు. శాస్త్ర సాంకేతికత సామాన్యుడికి అందాలనేదే మోదీ ఆశయమని చెప్పారు. ప్రపంచం మొత్తం భారత్‌వైపే చూస్తుందన్నారు.

ప్రస్తుతం నాలుగో పారిశ్రామిక విప్లవం నడుస్తోందని, ఇకపై బ్యాంకు బ్రాంచులు తగ్గుతాయని, బ్యాంకింగ్ సేవలు పెరుగుతాయని అన్నారు. అతి తక్కువ ధరతో టీడీపీ ప్రభుత్వం ఒక విప్లవాన్ని తీసుకొచ్చిందని చంద్రబాబు చెప్పారు. రూ. 5000 కోట్లతో ఫైబర్ గ్రిడ్ తీసుకొచ్చామని, రూ. 149కే 15 ఎంబీపీఎస్ ఇంటర్నెట్, కేబుల్ టీవీ అందిస్తున్నామని తెలిపారు. బయోమెట్రిక్ పద్ధతిలో రేషన్ ద్వారా సరుకులు అందిస్తామని వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.