యాప్నగరం

రౌడీల తాట తీస్తాం.. త్వరలో 2500 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ: చంద్రబాబు

రాజకీయం ముసుగులో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఘటనలపట్ల పోలీసులు జాగ్రత్తగా ఉండాలి. రౌడీలు ఏపీ బయటే ఉండాలని.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం..

Samayam Telugu 21 Oct 2018, 10:59 am
రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో రాజీనే లేదన్నారు సీఎం చంద్రబాబు. ఆదివారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. విధుల్లో అమరులైన పోలీసులకు సీఎం నివాళులు అర్పించి.. వారి చేసిన సేవల్ని స్మరించుకున్నారు. అమరావతిలో పోలీసు అమరవీరుల స్థూపం నిర్మిస్తామన్నారు చంద్రబాబు. ప్రతి పోలీస్ స్టేషన్‌కు ఆధునిక వాహనం అందుబాటులో ఉంచుతామన్నారు. రాజధాని పరిధిలో త్వరలో 2500మంది కానిస్టేబుళ్ల నియామకం చేపడతామన్నారు. పోలీసుల సంక్షేమానికి రూ.15కోట్లు కేటాయించామని.. పోలీసు కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
Samayam Telugu Cm


ప్రజల భద్రతే ధ్యేయమని.. ఫ్రెండ్లీ పోలీసింగ్ తమ లక్ష్యమన్నారు సీఎం. పోలీసులకు కుటుంబం కంటే ప్రజాసేవ అంటేనే ఇష్టమని.. తమ జీవితాన్ని దేశం కోసం ప్రజల కోసం అంకితం చేయడం గొప్ప సేవానిరతన్నారు. పోలీసుల త్యాగాలకు నిదర్శనమే అమరవీరుల సంస్మరణ దినమని కొనియాడారు. రాజకీయం ముసుగులో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఘటనలపట్ల పోలీసులు జాగ్రత్తగా ఉండాలన్నారు సీఎం. రౌడీలు ఏపీ బయటే ఉండాలని.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.