యాప్నగరం

సింగపూర్‌లో చంద్రబాబు రెండో రోజు పర్యటన

సింగపూర్‌ పర్యటనలో బిజీ, బిజీగా ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రపంచ నగరాల సదస్సులో పాల్గొన్న సీఎం.. కీలక ప్రసంగం చేశారు. సింగపూర్ ఎగ్జిబిషన్‌ను ఆయన పరిశీలించారు.

Samayam Telugu 9 Jul 2018, 11:15 am
సింగపూర్‌లో రెండో రోజు పర్యటిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రపంచ నగరాల సదస్సులో పాల్గొన్న సీఎం.. కీలక ప్రసంగం చేశారు. ‘నీరు, పర్యావరణానికి సంబంధించిన లక్ష్యాలను చేరుకోవాలంటే సాంకేతికత, మౌలిక సదుపాయాల కల్పన చాలా ముఖ్యం. వనరుల నిర్వహణలో వైజ్ఞానిక, సమాచార సాంకేతికత ఫాత్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. అమరావతిలో అన్ని ఆధునిక సాంకేతిక పద్ధతుల్ని వినియోగించుకుంటున్నాం. రాష్ట్రంలో సరికొత్త నిర్వహణ పద్ధతుల్లో భూగర్భజలాలను పెంచగలుగుతున్నాం. నదుల అనుసంధానం, భూగర్భ జలాలు, వ్యర్థ నీటిని నిర్వహణలో మెరుగైన ఫలితాలు సాధించాం. రైతుల భాగస్వామ్యంతో జీరో బేస్డ్ నాచురల్ ఫార్మింగ్ వైపు వెళ్తున్నామన్నారు’సీఎం.
Samayam Telugu BABU


ఈ ప్రపంచ నగరాల సదస్సులో చంద్రబాబుతో పాటూ శ్రీలంక ప్రధాని రనిల్ విక్రమసింఘే, సింగపూర్ ఉప ప్రధాని థర్మన్ షణ్ముగరత్నంలు పాల్గొన్నారు. వారు కూడా పలు కీలక ప్రసంగాలు చేశారు. అంతకముందు సీఎం బృందం సింగపూర్ ఎగ్జిబిషన్‌ను సందర్శించింది. స్మార్ట్ అర్బన్ హ్యాబిటేట్‌పై ప్రధానంగా పరిశీలించారు. తక్కువ స్థలంలో ఇళ్ల నిర్మాణాలు ఎలా చేయాలో అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి విధానాలన్నింటిని అనుసరించి.. రాష్ట్రంలో కూడా ఇళ్లి నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు.

మరోవైపు సింగపూర్ టూర్‌‌లో పెట్టుబడులపై కూడా సీఎం ఫోకస్ పెట్టారు. పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంతో పాటూ అమరావతిలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. పెట్టుబడులు, పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటూ ఆహ్వానం పలికారు. ఇవాళ, రేపు కూడా మరికొందర్ని సీఎం కలవనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.