ఆ నలుగురు టార్గెట్ మనమే.. అయినా ఆల్ ఈజ్ వెల్: చంద్రబాబు
వాళ్ల టార్గెట్ టీడీపీనే.. వాళ్ల తిట్లే మనకు ప్రజా దీవెనలు.. ఒకరేమో తుఫాన్ బాధితుల్ని రెచ్చగొడతారు.. మరొకరు ఒడ్డున ఉండి గడ్డలేస్తారు..
Samayam Telugu 19 Oct 2018, 2:34 pm
ఆ నలుగురు టీడీపీ టార్గెట్ చేశారంటున్నారు అధినేత చంద్రబాబు. వారి తిట్లే తమకు ఆశీర్వాదాలంటూ ఆసక్తికరంగా మాట్లాడారు. శుక్రవారం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో బాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ల నమోదు, కౌన్సిల్ ఎన్నికలు, బూత్ కన్వీనర్ల శిక్షణపై ఆరా తీశారు. ఈ సందర్భంగా నేతలతో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజల సంక్షేమం కోసం టీడీపీ పోరాటం చేస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. ఆ పార్టీలన్నీ కలిసి టీడీపీని టార్గెట్ చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.
టీడీపీని ప్రతిపక్షాలు ఎంత టార్గెట్ చేస్తే అంత మంచిదన్నారు చంద్రబాబు. వారి తిట్లే పార్టీకి ప్రజా దీవెనలన్నారు. పార్టీపై ప్రజలు నమ్మకంతో ఉన్నారని.. అది చూసి ఓర్చుకోలేక.. బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్, జనసేనలు టార్గెట్ చేస్తున్నాయన్నారు. ప్రజలకు టీడీపీని దూరం చేయాలని విపక్షాలు కుట్రలు చేస్తుంటే.. ప్రజలు నమ్మకంతో ఉన్నారన్నారు. తాను బాధితుల్ని పరామర్శిస్తుంటే.. వైసీపీ ప్రజలను రెచ్చగొట్టి అడ్డంకులు పెడుతున్నారని మండిపడ్డారు.జగన్ పాదయాత్రకు ప్రజల్లో నుంచి స్పందన లేదని అభిప్రాయపడ్డారు చంద్రబాబు. మరో నాలుగేళ్లు యాత్ర చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఇక పవన్కల్యాణ్ ఒడ్డున ఉండి గడ్డలు వేస్తున్నాడని వ్యాఖ్యానించారు.
జనసేన కవాతును పశంసలు కురిపించి మంత్రి కేటీఆర్.. తుఫాన్ బాధితులకు సానుభూతి ప్రకటించకపోవడం బాధగా ఉందన్నారు. తిత్లీ నష్టం చూసేందుకు కేంద్రం నుంచి ఒక్క బీజేపీ నేత కూడా రాకపోవడం దారుణమన్నారు చంద్రబాబు. కనీసం తక్షణ సాయం కూడా ప్రకటించకపోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రజల ఆశీర్వాదమే టీడీపీ రక్ష అని.. దీని కోసం తానొక్కడినే కష్టపడితే కుదరన్నారు. నేతలు కూడా కష్టపడాలని.. నిత్యం ప్రజల్లో ఉండాలని సూచించారు.
టీడీపీని ప్రతిపక్షాలు ఎంత టార్గెట్ చేస్తే అంత మంచిదన్నారు చంద్రబాబు. వారి తిట్లే పార్టీకి ప్రజా దీవెనలన్నారు. పార్టీపై ప్రజలు నమ్మకంతో ఉన్నారని.. అది చూసి ఓర్చుకోలేక.. బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్, జనసేనలు టార్గెట్ చేస్తున్నాయన్నారు. ప్రజలకు టీడీపీని దూరం చేయాలని విపక్షాలు కుట్రలు చేస్తుంటే.. ప్రజలు నమ్మకంతో ఉన్నారన్నారు. తాను బాధితుల్ని పరామర్శిస్తుంటే.. వైసీపీ ప్రజలను రెచ్చగొట్టి అడ్డంకులు పెడుతున్నారని మండిపడ్డారు.జగన్ పాదయాత్రకు ప్రజల్లో నుంచి స్పందన లేదని అభిప్రాయపడ్డారు చంద్రబాబు. మరో నాలుగేళ్లు యాత్ర చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఇక పవన్కల్యాణ్ ఒడ్డున ఉండి గడ్డలు వేస్తున్నాడని వ్యాఖ్యానించారు.
జనసేన కవాతును పశంసలు కురిపించి మంత్రి కేటీఆర్.. తుఫాన్ బాధితులకు సానుభూతి ప్రకటించకపోవడం బాధగా ఉందన్నారు. తిత్లీ నష్టం చూసేందుకు కేంద్రం నుంచి ఒక్క బీజేపీ నేత కూడా రాకపోవడం దారుణమన్నారు చంద్రబాబు. కనీసం తక్షణ సాయం కూడా ప్రకటించకపోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రజల ఆశీర్వాదమే టీడీపీ రక్ష అని.. దీని కోసం తానొక్కడినే కష్టపడితే కుదరన్నారు. నేతలు కూడా కష్టపడాలని.. నిత్యం ప్రజల్లో ఉండాలని సూచించారు.