యాప్నగరం

ఆ నేతలపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్!

కొత్తగా కేబినెట్‌లోకి వచ్చిన మంత్రులకి శాఖల కేటాయింపుపై కసరత్తు చేపట్టిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. కేబినెట్

Samayam Telugu 3 Apr 2017, 2:38 pm
కొత్తగా కేబినెట్‌లోకి వచ్చిన మంత్రులకి శాఖల కేటాయింపుపై కసరత్తు చేపట్టిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ సందర్భంగా కొంతమంది నేతలు అలక వహించడం, అధిష్టానాన్ని ధిక్కరించినట్టు మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది. తాజాగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు... నిన్న జరిగిన పరిణామాలని ప్రస్తావిస్తూ నేతల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.
Samayam Telugu ap cm chandrababu serious on tdp leaders over their dissatisfaction
ఆ నేతలపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్!


'కేబినెట్‌లో చోటు లభించలేదని కొందరు, చోటు కోల్పోయామని ఇంకొందరు నిన్న శృతిమించి ప్రవర్తించిన తీరు చాలా బాధాకరం. ఏదైనా వుంటే నేరుగా నాతో చెప్పుకోవాలి కానీ ఇలా ఈ విధంగా వ్యవహరించడం సరికాదు. మంత్రివర్గంలో అన్ని ప్రాంతాలకి ప్రాధాన్యత కల్పించాం. అంతకన్నా ఎక్కువ ఇంకేం చేయగలం! మనందరి ముందున్న ఏకైక లక్ష్యం 2019 ఎన్నికల్లో గెలవడమే. అంతేకానీ అసంతృప్తితో మరొకరికి మేలు కలిగేలా చేయడం కాదు' అని చంద్రబాబు నేతలని మందలించినట్టు సమాచారం.

కేబినెట్‌లోంచి తొలగించిన వారిలో వున్న బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా, మంత్రి పదవి వస్తుందని ఆశించి భంగపడిన బోండా ఉమ, దూళిపాళ్ల నరేంద్ర వంటి నేతలు కొంతమంది అసంతృప్తి వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. మరో సీనియర్ నేత, మాజీ మంత్రి అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి తనకి మంత్రి పదవి రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. బహుశా ఇటువంటి పరిణామాలని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు సీరియస్ అయ్యుంటారని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.