యాప్నగరం

నిధుల లేమి ఉన్నా... అభివృద్ధి సాధించాం

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో పాల్గొన్నారు.

TNN 28 Sep 2016, 1:57 pm
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో పాల్గొన్నారు. ఆ సదస్సులో ఆయన మాట్లాడుతూ... ‘రాజధాని లేదు, వనరులు లేమి పీడిస్తోంది, అయినా కూడా మనం అభివృద్ధిని సాధించాం’ అని అన్నారు. జాతీయ వృద్ధితో పోలిస్తే రాష్ట్ర జీఎస్‌డీపీనే బాగుందని, ఇతర రాష్ట్రాల కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ ముందుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టను 2018 కల్లా పూర్తి చేయడమే తన లక్ష్యమని, ఆ ప్రాజెక్టుకు నిధుల సమస్య లేకుండా, అంతా కేంద్రమే భరించేలా చేసుకున్నామని అన్నారు. నీటిని కాపాడుకుంటేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. వర్షపు నీటిని కాపాడుకోవాలని, భూగర్భ జలాలని పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సు వివిధ జిల్లాల కలెక్టర్లతో పాటూ మంత్రులు చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి, యనమల, ప్రత్తిపాటి, రావెల కిశోర్ తదితరులు పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.