ఆగస్టు 12 నుంచి జరగబోయే కృష్ణా పుష్కరాలను ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. గోదావరి పుష్కరాల సమయంలో జరిగినట్టు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు నుంచే ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం అధికారులను, మంత్రులను ఆదేశించారు. ఈ మేరకు కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లా కలెక్టర్లు, అధికారులు, మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ తో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కృష్ణా పుష్కరాలను ప్రజా సేవ చేసేందుకు ఓ అవకాశంగా తీసుకోవాలని అన్నారు. ఎలాంటి సమస్యలు కలగుకుండా చూసుకోవాలని, ఘాట్ల వద్ద బారికేడ్లను దృఢంగా నిర్మించాలని అన్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కనుక... సంచార వైద్యశాలలను సిద్ధంగా ఉంచాలని అన్నారు. కలెక్టర్లతో పాటూ వివిధ శాఖలకు చెందని 571 మంది అధికారులు టెలీకాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
కృష్ణా పుష్కరాలను సమర్థంగా నిర్వహిద్దాం
ఆగస్టు 12 నుంచి జరగబోయే కృష్ణా పుష్కరాలను ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
TNN 4 Aug 2016, 2:43 pm