ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 1న హస్తినబాటపట్టనున్నారు. ఈ టూర్లో బీజేపీయేతర కూటమి చేసే పోరాటాలపై జాతీయ స్థాయి నేతలతో చర్చించబోతున్నారు. కోల్కతా తరహా సభలను నిర్వహించాలని భావిస్తున్న చంద్రబాబు.. తన ఆలోచనను జాతీయ నేతల దగ్గర ప్రస్తావించాలనుకుంటున్నారు. అలాగే అమరావతిలో కూడా సభ ఏర్పాటు చేయాలనుకుంటున్న టీడీపీ అధినేత.. ఈ అంశంపై కూడా నేతలతో చర్చిస్తారట. ఈవీఎంల పనితీరుపై జాతీయ నేతలతో చంద్రబాబు మంతనాలు జరపనున్నారు. ఈవీఎంలు వద్దంటూ ఫిబ్రవరి 1న ఎన్నికల సంఘంతో పాటూ రాష్ట్రపతిని కలవాలని భావినిస్తున్నారట. ఈ అంశంపై కూడా టీడీపీ అధినేత చర్చిస్తారట. అంతేకాదు చంద్రబాబు ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం ఢిల్లీలో దీక్ష చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ విషయాన్ని జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్లబోతున్నారట.
ఫిబ్రవరి 1న చంద్రబాబు ఢిల్లీ పర్యటన?
మరోసారి హస్తిన పర్యటనకు సిద్దమైన చంద్రబాబు. బీజేపీయేతర కూటమి పోరాటాలు, ఈవీఎంల వ్యవహారంపై జాతీయ నేతలతో చర్చిచనున్న టీడీపీ అధినేత. దేశవ్యాప్తంగా కోల్కతా తరహాలో సభలు నిర్వహించే ఆలోచన.
Samayam Telugu 29 Jan 2019, 1:03 pm
ప్రధానాంశాలు:
- ఢిల్లీ పర్యటనలో జాతీయ నేతలతో చంద్రబాబు భేటీ
- ఈవీఎంల వ్యవహారంపై ఈసీని, రాష్ట్రపతిని కలిసే ఆలోచన
- కోల్కతా తరహాలో సభలు ఏర్పాటు చేసే అంశంపై చర్చ