యాప్నగరం

మానవ తప్పిదాల వల్లే కరవు అధికమైంది

ఢిల్లీ: కరవు సమస్యపై ప్రధానితో భేటీ అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు.

TNN 17 May 2016, 6:41 pm
ఢిల్లీ: ఏపీని కరవు రహితంగా మార్చడమే తమ ప్రభత్వ లక్ష్యమని చంద్రబాబు అన్నారు. కరవు సమస్యపై ప్రధానితో భేటీ అనంతరం ఏపీ సీఎం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ తప్పిదాల వల్లే రాష్ట్రం, దేశంలో కరవు సమస్య అధికమైందని అభిప్రాయపడ్డారు. నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోలేకపోవడం వల్ల నీరు వృధాగా సముద్రంలో కలుస్తుందని వెల్లడించారు. భవిష్యత్తులో నీటిని మరింత పొదుపుగా ఉపయోగించుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
Samayam Telugu ap cm conduct press meet drought problem
మానవ తప్పిదాల వల్లే కరవు అధికమైంది


కరవును రూపుమాపేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. దీని కోసం నదుల అనుసంధానం, నీరు చెట్టు వంటి పథకాలను అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 973 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా తాగు నీటిని అందిస్తున్నామన్నారు. ఇన్ పుట్ సబ్బీడీ కింద రూ. 737 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. 18 వేల మెట్రిక్ టన్ను గడ్డిని సరఫరా చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పంటకాల్వలు, నీటి కుంటలను తవ్విస్తున్నామని వెల్లడించారు. కృష్ణానదిలో మరిన్ని టీఎంసీల నీరు చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నీటిని పొదుపు చేసే చర్యలో భాగంగా రెయిన్ గన్ పద్దతి తీసుకొచ్చినట్లు వివరించారు. అలాగే మైక్రో ఇరిగేషన్ పద్దితి ద్వారా కరవు ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు.

కరవు నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేసినట్లు ఏపీ సీఎం వెల్లడించారు..ఈ విషయాలన్నీ ప్రధాని దష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ప్రధానితో జరిగిన చర్చలు కరవు నివారణకు ఉపయోగపడతాయని ఏపీ సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. కరవు నివారణ కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని ..దీనికి సంబంధించిన నిధులను తక్షణమే విడుదల చేయాలని ప్రధాని మోడీని కోరినట్లు ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.