యాప్నగరం

కరవును ఎదుర్కొనేందుకు తక్షణమే నిధులు ఇవ్వండి..

ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం ప్రధాని మోడీతో భేటీ అయ్యారు.

TNN 17 May 2016, 1:49 pm
ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు అధికారులతో కలిసి మంగళవారం ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో భాగంగా రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితుల గురించి ప్రధాని మోడీ ఆరా తీశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఏపీ కరవు పరిస్థితిపై నివేదిక సమర్పించారు. కరవు నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, కేంద్రం ఇచ్చిన నిధులు తదితర అంశాలను నివేదికలో పొందుపర్చారు. కరవును ఎదుర్కొనేందుకు తక్షణమే నిధులు విడుదల చేయాలని ఈ సందర్భంగా ప్రధాని మోడీని కోరారు. ఇదే సందర్భంలో ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం అంశాలను సీఎం చంద్రబాబు ప్రధానితో చర్చించినట్లు సమాచారం.
Samayam Telugu ap cm meet to pm modi
కరవును ఎదుర్కొనేందుకు తక్షణమే నిధులు ఇవ్వండి..


దేశంలో నెలకొన్న కరవు పరిస్థితులను సమీక్షించాలని ఇటీవలే సుప్రీంకోర్టు కేంద్రానికి ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అత్యున్నత ధర్మాసనం ఆదేశాల నేపథ్యంలో ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల సీఎంలతో వరుస భేటీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రధానిని కలిసి తెలంగాణలో నెలకొన్న కరవు పరిస్థితులపై సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్ సీఎంలకు మోడీ చర్చకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఛత్తీస్ గఢ్ సీఎంతో ప్రధాని మోడీ భేటీ నిర్వహించారు. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. కాగా ఈ భేటీలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణులు, సహా రాష్ట్రానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.