గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలిశారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం రాజ్భవన్కు వెళ్లి గవర్నర్తో భేటీ అయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ఆమోదించిన బిల్లుల గురించి గవర్నర్కు సీఎం వివరించారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు.. విభజన సమస్యలపైనా చర్చించినట్లు తెలుస్తోంది. ప్రజాసంక్షేమానికి సంబంధించి పాలన ఎలా ఉండబోతుందో చెప్పారు. అంతకముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించినందుకు జనసేన పార్టీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. తాజా రాజకీయాలపై గవర్నర్తో కాసేపు ముచ్చటించారు. పవన్ వెంట పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబుతో పాటూ ముఖ్య నేతలు ఉన్నారు. హరిచందన్ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి పవన్ కలిశారు. గత వారమే టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే.
గవర్నర్ను కలిసిన సీఎం జగన్, జనసేన అధినేత పవన్
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అసెంబ్లీ నిరవధిక వాయిదా పడిన తర్వాత గవర్నర్తో సీఎం సమావేశం.
Samayam Telugu 30 Jul 2019, 7:37 pm
ప్రధానాంశాలు:
- గవర్నర్ను కలిసి ముఖ్యమంత్రి జగన్
- అసెంబ్లీ సమావేశాలు, బిల్లులపై చర్చ
- గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిసిన పవన్