యాప్నగరం

Chandrababu Naidu, జగన్ విదేశీ పర్యటనలు.. ఆయన రాగానే, ఈయన..

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు కీలక నేతలు ఒకే వారంలో వేర్వేరు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు అమెరికా వెళ్తుండగా.. సీఎం జగన్ జెరూసలేం వెళ్తున్నారు.

Samayam Telugu 26 Jul 2019, 7:50 pm
ఏపీ సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వేర్వేరుగా విదేశీ పర్యటనలకు వెళ్లనున్నారు. చంద్రబాబు అమెరికా వెళ్తుండగా.. జగన్ జెరూసలెం వెళ్తున్నారు. ఇద్దరివీ వ్యక్తిగత పర్యటనలే. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఆదివారం అమెరికా వెళ్తున్నారు. మూడ్రోజులపాటు ఆయనలో అమెరికా పర్యటనలో ఉండబోతున్నారు. వైద్య పరీక్షల నిమిత్తమే బాబు యూఎస్ వెళ్తున్నారని తెలుస్తోంది. ఆయన తిరిగి ఆగష్టు 1న ఇండియా రానున్నారు.
Samayam Telugu jaganvsbabu


చంద్రబాబు స్వదేశానికి వచ్చిన రోజే సీఎం వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆగష్టు 1 నుంచి 4వ తేదీ వరకు ఇజ్రాయెల్‌లోని జెరూసలేంలో కుటుంబ సమేతంగా జగన్ పర్యటిస్తారు. ఆయన సొంత ఖర్చులతో ఈ పర్యటనకు వెళుతున్నారు. ఈ పర్యటనకు కేంద్ర హోం శాఖ నుంచి అనుమతి లభించింది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా కుటుంబ సమేతంగా జెరూసలేం వెళ్లొచ్చారు.

జెరూసలేం పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత జగన్ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఆగష్టు 17 నుంచి 23 వరకు జగన్ అమెరికాలో పర్యటిస్తారు. అమెరికా పర్యటన సందర్భంగా డల్లాస్‌లోని కేబెల్లే కన్వెన్షన్ సెంటర్ ప్రవాస భారతీయులతో జగన్ సమావేశం కానున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.