యాప్నగరం

అవినీతి విషయంలో కళ్లు మూసుకోండని ఒత్తిడి.. జగన్ సంచలన వ్యాఖ్యలు

అవినీతిని ఏమాత్రం సహించబోనని చెబుతున్న జగన్.. ప్రాజెక్టుల్లో అవినీతి విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు. కళ్లు మూసుకోండని తనపైనా ఒత్తిడి తెచ్చారన్నారు.

Samayam Telugu 22 Jun 2019, 7:57 pm
ప్రాజెక్టుల్లో అవినీతి విషయమై ఏపీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి విషయంలో కళ్లు మూసుకోండని తనపై కూడా ఒత్తిడి తెచ్చారని జగన్ తెలిపారు. ఇంజనీరింగ్ నిపుణుల కమిటీతో శనివారం సమీక్ష నిర్వహించిన నిర్వహించిన జగన్.. ప్రాజెక్టుల్లో అవినీతికి ఆస్కారం ఉండొదన్నారు. అవినీతిపై పోరాటానికి సిద్ధమయ్యానన్న ఆయన.. టెండర్ల విధానాన్ని అత్యంత పాదర్శకంగా రూపొందించాలన్నారు. చెడిపోయిన వ్యవస్థను బాగు చేసుకోవడానికి తాను తపిస్తున్నానని తెలిపారు.
Samayam Telugu ysj cm


అవినీతిని సహించబోమని పై స్థాయి నుంచి కింది స్థాయి వరకూ అందరికీ ఓ సందేశం వెళ్లాలని జగన్ తెలిపారు. అంచనాలు పెంచారని భావిస్తే వెంటనే రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్దామన్నారు. ఏపీ ప్రభుత్వం పారదర్శకత దేశానికి ఒక సంకేతం పంపాలని ఆకాక్షించిన సీఎం.. జ్యుడిషియల్‌ కమిషన్‌‌ను అందుకే ఏర్పాటు చేశామన్నారు.

పోలవరం ప్రాజెక్ట్‌కు తానెంతో ప్రాధాన్యం ఇస్తున్నానన్న జగన్.. పనుల్లో అవకతవకలపై నిగ్గు తేల్చాలని నిపుణుల కమిటీని ఆదేశించారు. ఏపీ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉందన్న జగన్.. అవినీతి వల్ల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. పోలవరం ప్రాజెక్టులో స్పిల్‌వే పూర్తి చేయకుండా కాపర్ డ్యాం పనులు చేపట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రతిష్టాత్మక ఈ ప్రాజెక్టును టీడీపీ సర్కారు గందరగోళంలో పడేసిందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.