యాప్నగరం

శభాష్ సీఎం.. అంబులెన్స్‌కు దారి ఇవ్వడం కోసం కాన్వాయ్ ఆపేసిన జగన్

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మరోసారి శభాష్ అనిపించుకున్నారు. తాడేపల్లి నుంచి గన్నవరం బయల్దేరిన ఆయన అంబులెన్స్ కోసం తన కాన్వాయ్ ఆపేశారు. అంబులెన్స్ వెళ్లిన తర్వాతే తన కాన్వాయ్‌ను ముందుకుపోనిచ్చారు.

Samayam Telugu 13 Jul 2019, 9:28 pm
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. అంబులెన్స్‌కు దారి ఇవ్వడం కోసం ఆయన తన కాన్వాయ్‌ను ఆపించారు. శనివారం సాయంత్రం రాష్ట్రపతి కోవింద్‌కు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలకడం కోసం గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంట వెళ్లారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయల్దేరిన జగన్.. విజయవాడ బెంజ్ సర్కిల్‌ చేరుకోగానే అంబులెన్స్ సైరన్ వినిపించింది. దీంతో అంబులెన్స్‌కు దారి ఇవ్వడం కోసం జగన్ తన కాన్వాయ్‌ను ఆపించారు. అంబులెన్స్ వెళ్లిన తర్వాత తన కాన్వాయ్‌ను కదలనిచ్చారు.
Samayam Telugu jagan convoy gives way to ambulance.


అంబులెన్స్‌కు దారి ఇవ్వడం కోసం జగన్ తన కాన్వాయ్‌ను నిలిపేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో గవర్నర్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొనడం కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన.. రాజ్‌భవన్ నుంచి బయటకు వెళ్తుండగా.. అంబులెన్స్ శబ్దం వినిపించింది. దీంతో అంబులెన్స్ వెళ్లిన తర్వాతే కాన్వాయ్‌లో బయల్దేరి వెళ్లారు.
జగన్ తండ్రి దివంగత రాజశేఖర రెడ్డి హయాంలోనే 108 అంబులెన్సు సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ అంబులెన్సులు కుయ్ కుయ్ మంటూ.. ప్రమాదస్థలికి చేరుకుని క్షతగాత్రులను, అనారోగ్యం బారిన పడ్డ వారిని వెంటనే హాస్పిటల్‌కు తరలించేవి. అంబులెన్సుల విషయంలో తండ్రి కంటే ఓ అడుగు ముందుకేసిన జగన్.. ప్రతి మండలానికి ఒకటి చొప్పున అంబులెన్సులను ఏర్పాటు చేస్తానని బడ్జెట్ సందర్భంగా జగన్ పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.