యాప్నగరం

YS Jagan, కేసీఆర్ మరోసారి భేటీ.. ప్రగతి భవన్లో కీలక అంశాలపై చర్చ!

ఏపీ సీఎం వైఎస్ జగన్ జూన్ 28న హైదరాబాద్ రానున్నారు. ప్రగతి భవన్లో ఆయన కేసీఆర్‌తో భేటీ కానున్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలు విభజన సమస్యలపై చర్చించనున్నారు.

Samayam Telugu 24 Jun 2019, 11:07 pm
ఏపీ సీఎం వైఎస్ జగన్ హైదరాబాద్ రానున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఆయన భేటీకి డేట్ ఫిక్స్ అయ్యింది. జూన్ 28న జగన్ ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో సమావేశం కానున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై ఇద్దరు సీఎంలు చర్చించనున్నారు. గోదావరి జలాలను శ్రీశైలం ప్రాజెక్టుకు తరలించడం, లింక్ కెనాల్‌లపై ఇద్దరూ చర్చలు జరుపుతారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే.
Samayam Telugu jagan hyd


జగన్ తన ప్రమాణ స్వీకారానికి కేసీఆర్‌ను ఆహ్వానించగా.. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఆంధ్రా సీఎంను కేసీఆర్ ఆహ్వానించారు. అంతకు ముందు హైదరాబాద్‌లోని ఏపీ భవనాలకు తెలంగాణ అప్పగిస్తున్నట్టు జగన్ ప్రకటించారు. ఇరు రాష్ట్రాలు కలిసి సాగాలని నిర్ణయించాయి.

2014లో తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి రాగా.. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. కొద్ది రోజులు బాగానే ఉన్నప్పటికీ.. తర్వాత ఇరు ప్రభుత్వాల అధినేతల మధ్య దూరం పెరిగింది. ఇప్పటికీ చాలా విభజన హామీలు పెండింగ్‌లో ఉన్నాయి. నీటి సమస్యలు కొలిక్కి రావాల్సి ఉంది. ప్రధానంగా గోదావరి, కృష్ణా జలాల విషయంలో ఇరు రాష్ట్రాలు ఓ అవగాహనకు రావాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.