యాప్నగరం

‘అమ్మ ఒడి’ కొందరికే కాదు, అందరికీ.. సీఎంవో కీలక ప్రకటన!

జగన్ నవరత్నాల్లో ఇచ్చిన హామీల్లో ఒకటైన అమ్మ ఒడి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుంది. ఈ పథకం కింద పేద కుటుంబాల తల్లులకు ఏడాదికి రూ.15,000 అందజేస్తారు.

Samayam Telugu 7 Dec 2022, 12:52 pm
ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పిల్లలను పాఠశాలలను పంపే తల్లులకు ‘అమ్మ ఒడి’ పథకం కింద ఏడాదికి రూ.15,000 ఇవ్వనున్నట్టు జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని వచ్చే జనవరి 26 నుంచి అమలుచేయనున్నారు. అయితే, అమ్మ ఒడి ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే వర్తిస్తుందని ఇటీవల విద్యాశాఖ, ఆర్థిక శాఖ మంత్రులు ప్రకటించారు. కేవలం, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే పేద పిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందన్న వదంతుల నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. ఈ పథకానికి సంబంధించి ఎలాంటి అపోహలు, అనుమానాలకు తావులేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలలో చదివే పేద కుటుంబాలకు చెందిన ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తిస్తుందని తెలిపింది. విద్యార్థి పేదరికాన్ని కొలమానంగా తీసుకుంటామని పేర్కొంది.
Samayam Telugu Ammavodi


బడిబాట కార్యక్రమంలో అక్షరాభ్యాసం సందర్భంగా విద్యా శాఖ సమీక్ష సమావేశంలో ఈ పథకం గురించిన విధివిధానాలు రూపొందించాలని సీఎం ఆదేశించారని తెలిపింది. ఇందులో భాగంగా ముందు ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచే దిశగా అన్ని చర్యలు త్వరలో ప్రారంభం కాబోతున్నాయని వెల్లడించింది. దేశంలో నిరక్షరాస్యత సగటు 26 ఉంటే, అది ఏపీలో 33 శాతంగా ఉందని.. అక్షరాస్యత విషయంలో ఏపీ దేశంలో అట్టడుగున ఉంది.. ఈ పరిస్థితిని మార్చి.. పేద కుటుంబాల్లోని పిల్లలు చదువుకునే విధంగా ఈ పథకాన్ని ప్రకటించారు’ అని ‘అమ్మ ఒడి’ పథకం ఆవశ్యకతను వివరించింది. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, అక్షరాస్యతను పెంచడమే అమ్మ ఒడి పథకం లక్ష్యమని పేర్కొంది. దీనిపై ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ప్రకటించారు. , ప్రతిఒక్కరూ చదువుకోవాలనే ఉద్దేశంతోనే ‘అమ్మఒడి’ తీసుకొస్తున్నట్టు తెలిపింది.

అమ్మ ఒడి పథకంపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రెండు రోజుల కిందట స్పందించారు. ఈ పథకం కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. సర్కారీ బడులకు పంపించే పిల్లలకు మాత్రమే అమ్మఒడి పథకం కింద రూ.15వేల అందజేస్తామన్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలకే వర్తింపజేయాలని కోరుతూ ఉపాధ్యాయ, విద్యా సంఘాలు కోరుతున్నాయి. ఈ పథకాన్ని ప్రయివేటు పాఠశాలలకు కూడా వర్తింపజేస్తే ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు చెల్లించడం ద్వారా ఎంతోమంది పేదలకు చదువుకునే అవకాశం కలుగుతుందని అంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.