ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పకు సొంత కుటుంబం నుంచి షాక్ తగలింది. రాజప్ప సోదరుడు లక్ష్మణ మూర్తి జనసేన పార్టీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా పెదగాడవిల్లిలో జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఆ పార్టీకి మద్దతు తెలిపారు. అనంతరం జనసేన కండువా కప్పుకున్నారు. లక్ష్మణమూర్తిని స్థానికులు బాపూజీ అని పిలుస్తుంటారు. మొన్నటి వరకు ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు మాత్రం జనసేనలో చేరారు. తమ చుట్టు పక్కల గ్రామాల్లో యువత జనసేనలో కీలకపాత్ర పోషిస్తున్నారని.. వారికి అండగా ఉండేందుకే పార్టీలో చేరానని బాపూజీ తెలిపారు. ‘’మన మంచిని కోరుతూ మన వెంట ఉన్న జనం వెంట నడవటం ఎంత మాత్రం తప్పుకాదు’అంటున్నారు.
లక్ష్మణమూర్తి పార్టీలో చేరడంపై జనసేన పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం సోదరుడే జనసేనలో చేరడం శుభపరిణామమని.. స్థానికంగా పార్టీ బలోపేతం అవుతందని చెబుతున్నారు.
లక్ష్మణమూర్తి పార్టీలో చేరడంపై జనసేన పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం సోదరుడే జనసేనలో చేరడం శుభపరిణామమని.. స్థానికంగా పార్టీ బలోపేతం అవుతందని చెబుతున్నారు.