యాప్నగరం

అలిపిరిలో రాళ్ల దాడి జరగలేదు: ఏపీ డీజీపీ

అలిపిరి ఘటనపై ఏపీ డీజీపీ మాలకొండయ్య స్పందించారు. అమిత్ షా కాన్వాయ్‌పై ఎలాంటి రాళ్లదాడి జరగలేదని క్లారిటీ ఇచ్చారు. షా కాన్వాయ్ వెళుతుండగా... ఏడో కారు అలిపిరి దగ్గర కాస్త స్లోగా వెళ్లిందని... ఈలోపు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి కర్రతో అద్దం పగులగొట్టారని తెలిపారు.

Samayam Telugu 12 May 2018, 4:42 pm
అలిపిరి ఘటనపై ఏపీ డీజీపీ మాలకొండయ్య స్పందించారు. అమిత్ షా కాన్వాయ్‌పై ఎలాంటి రాళ్లదాడి జరగలేదని క్లారిటీ ఇచ్చారు. షా కాన్వాయ్ వెళుతుండగా... ఏడో కారు అలిపిరి దగ్గర కాస్త స్లోగా వెళ్లిందని... ఈలోపు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి కర్రతో అద్దం పగులగొట్టారని తెలిపారు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు అతడ్ని పట్టుకొని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇప్పటికే కేసు నమోదు చేశారని... ఒకర్ని అరెస్ట్ కూడా చేశామని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు కూడా కొనసాగుతుందన్నారు మాలకొండయ్య.
Samayam Telugu Dgp


అలిపిరి గొడవపై ఇరు పార్టీల నుంచి పోలీసులకు ఫిర్యాదులు అందినట్లు డీజీపీ తెలిపారు. రెండింటిని స్వీకరించామని... ఎవరి తప్పున్నా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనలో తమ సిబ్బంది తప్పుందని తేలినా యాక్షన్ తప్పదన్నారాయన. ఇవాళ డీజీపీ కొంతమంది బీజేపీ నేతలు కలిసి అలిపిరి ఘటనపై చర్యలు తీసుకొని... దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని కోరారు. తర్వాత మీడియాతో మాట్లాడిన మాలకొండయ్య ఘటనపై క్లారిటీ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.