యాప్నగరం

కిడారి హత్య కేసులో కీలక ఆధారాలు దొరికాయి.. లోపాలుంటే సరిదిద్దుతాం: ఏపీ డీజీపీ

ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల కదిలికలు లేవని ఎప్పుడూ చెప్పలేదు.. వారి కార్యకలాపాలు మాత్రం తగ్గాయని మాత్రమే చెప్పాం.

Samayam Telugu 26 Sep 2018, 7:13 pm
అరకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమ హత్యకేసులో దర్యాప్తు ముమ్మరం చేశామన్నారు ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్. విశాఖ ఏజెన్సీలో పర్యటించిన డీజీపీ.. మావోయిస్టులు కాల్పుల జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. మావోల దాడి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలను సేకరించామన్నారు డీజీపీ. మావోల కదలికలపై నిఘా పెంచామని.. ఈ ఘటనపై స్పెషల్ టీమ్ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోందన్నారు.
Samayam Telugu Dgp


ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల కదిలికలు లేవని ఎప్పుడూ చెప్పలేదంటున్నారు ఠాకూర్. వారి కార్యకలాపాలు మాత్రం తగ్గాయని మాత్రమే చెప్పామన్నారు. రాంగూడ‌ ఎన్‌కౌంటర్‌ తర్వాత పోలీసులపై దాడి చేసేందుకు మావోలు ప్రయత్నించారని.. ఆ ప్రయత్నాలను సమర్థవంతంగా తిప్పికొట్టామన్నారు. లివిటిపుట్టుకు కొద్దిదూరంలోనే ఒడిశా సరిహద్దు ఉందని.. ఈ ప్రాంతాన్ని షెల్టర్‌‌గా చేసుకొని దాడికి పాల్పడ్డారన్నారు. ఒడిశా డీజీపీతో సమన్వయం చేసుకుంటూ.. సరిహద్దులో నిఘా పెంచుతామన్నారు. పోలీసుల వైపు నుంచి ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుతామన్నారు డీజీపీ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.