యాప్నగరం

శ్రీమంతుడు సినిమా 70 సార్లు చూశా: ఏపీ డీజీపీ

ప్రిన్స్ మహే‌శ్ బాబు హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'శ్రీమంతుడు' చిత్రం సామాన్య ప్రేక్షకుడితోపాటు రాజకీయ, సినీ, వ్యాపార, అధికార వర్గాలను సైతం ఆకట్టుకుంది.

TNN 31 Aug 2017, 10:17 am
ప్రిన్స్ మహే‌శ్ బాబు హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'శ్రీమంతుడు' చిత్రం సామాన్య ప్రేక్షకుడితోపాటు రాజకీయ, సినీ, వ్యాపార, అధికార వర్గాలను సైతం ఆకట్టుకుంది. ఊరుని దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం అనే పాయింట్‌తో తెరకిక్కిన ఈ సినిమాను చూసి అనేక మంది స్ఫూర్తి పొందారు. ఈ స్ఫూర్తితో రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులు కొన్ని ఊర్లను దత్తత కూడా తీసుకున్నాయి. అలాగే ఈ సినిమాపై ఏపీ డీజీపీ సాంబశివరావు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీమంతుడు చిత్రం తనకెంతో నచ్చిందని డీజీపీ సాంబశివరావు వ్యాఖ్యానించారు. ఆ సినిమాను తాను 70 సార్లు చూసివుంటానని చెప్పారు. సినిమాలో జగపతిబాబు చెప్పిన ఓ డైలాగును డీజీపీ సాంబశివరావు చెప్పి అక్కడున్న అందరితో చప్పట్లు కొట్టించారు.
Samayam Telugu ap dgp sambashiva rao reveals his favourate film is sreemanthudu
శ్రీమంతుడు సినిమా 70 సార్లు చూశా: ఏపీ డీజీపీ


"అందరూ వాడు పుట్టాడ్రా, వీడు పుట్టాడ్రా అంటారుగానీ, మంచోడు పుట్టాడ్రా నాకు" అన్న డైలాగ్‌ను చెప్పారు. గుంటూరులో శ్రీకృష్ణదేవరాయ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో పోలీసు కుటుంబాలకు చెందిన విద్యార్థులకు డీజీపీ ఉపకార వేతనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, విద్యార్థులు తమను తాము దిద్దుకోవాలని పిలుపునిచ్చారు. మత్తుకు తమ పిల్లలు బానిసలు కావడం పట్ల వారి తల్లిదండ్రుల ప్రమేయం కూడా ఉంటుందని పేర్కొన్నారు. పోలీసులు సాధారణంగానే కఠినంగా ఉంటారని, వారి విధి నిర్వహణా బాధ్యతలు అలాంటివని అన్నారు. పోలీసులు తమ పిల్లల్ని మిగతావారికన్నా అత్యుత్తమంగా పెంచాలని కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.