యాప్నగరం

చిరు, బాలయ్య ఫాన్స్‌కు ఏపీ డీజీపీ వార్నింగ్

అగ్రహీరోలు చిరంజీవి, బాలయ్య అభిమానులకు ఏపీ పోలీస్ బాస్ హెచ్చరికలు జారీ చేశారు.

Samayam Telugu 7 Jan 2017, 12:49 pm
అగ్రహీరోలు చిరంజీవి, బాలయ్య అభిమానులకు ఏపీ పోలీస్ బాస్ హెచ్చరికలు జారీ చేశారు. సంక్రాంతి పండుగకు వీరిద్దరి సినిమాలు ఖైదీ నెం.150, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలు విడుదల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు...డీజీపీ సాంబశివరావు అభిమానులకు మార్గదర్శకాలు జారీచేశారు. అభిమానం హద్దులు దాటితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Samayam Telugu ap dgp warns chiranjeevi balakrishna fans no to cross limits
చిరు, బాలయ్య ఫాన్స్‌కు ఏపీ డీజీపీ వార్నింగ్


అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. హీరోల బ్యానర్లు, పోస్టర్లు చించేవారిపై, సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు చేసే వారిపై కఠిన చర్యలుంటాయన్నారు.


ఈ రోజు సాయంత్రం గుంటూరు సమీపంలోని హాయ్ లాండ్ వేదికగా చిరంజీవి సినిమా ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.