యాప్నగరం

అన్నలు అడవులు వీడండి, చర్చలకు రండి!

లొంగిపోయే మావోయిస్టులకు ఎటువంటి హానీతలపెట్టబోమని కోర్టులో హాజరుపర్చుతామని ఆయన హామీ ఇచ్చారు.

Samayam Telugu 6 Nov 2016, 2:26 pm
అడవులు వీడితే అన్నల(మావోయిస్టులు)తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు తెలిపారు.
Samayam Telugu ap dgp welcomes maoists for talks
అన్నలు అడవులు వీడండి, చర్చలకు రండి!


ఇటీవల ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో చేపట్టిన కూంబింగ్ లో 31 మంది నక్సలైట్లు చనిపోయిన సంగతి తెలిసిందే.

మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కె తమ అదుపులో లేడని ఎప్పటి నుంచో చెబుతున్నామని, ఉద్దేశ్యపూర్వకంగానే ప్రజా సంఘాలు తమపై నిందలు మోపారని ఆయన అన్నారు.

చివరికి వారే (ప్రజాసంఘాలు) తమ సోర్సుల ద్వారా పోలీసుల అదుపులో లేడని, క్షేమంగా ఉన్నాడని ప్రకటించారని సాంబశివరావు గుర్తు చేశారు.

ఏవోబీలో కూంబింగ్ నిలిపివేశామని ఆయన చెప్పారు.

ప్రజాస్వామ్యాన్ని విశ్వసించి తుపాకులు వీడి చర్చలకు రావాలని ఆయన మావోయిస్టులను కోరారు. లొంగిపోయే మావోయిస్టులకు ఎటువంటి హానీతలపెట్టబోమని కోర్టులో హాజరుపర్చుతామని ఆయన హామీ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.