యాప్నగరం

ఐసీయూలో ఏపీ ఉపముఖ్యమంత్రి

ఏపీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప లిఫ్టు ప్రమాదంలో గాయపడ్డారు.

TNN 25 Oct 2016, 1:54 pm
ఏపీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప లిఫ్టు ప్రమాదంలో గాయపడ్డారు. పెద్దాపురం మండలం కట్టమూరు రొయ్యల శుద్ధి పరిశ్రమలో అస్వస్థతకు గురైన వారిని కాకినాడలోని సంజీవని ఆసుపత్రిలో చేర్చారు. వారిని పరామర్శించేందుకు డిప్యూటీ సీఎం ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రిలో మూడో అంతస్థులో ఉన్న బాధితులను చూశాక కిందకు వచ్చేందుకు లిఫ్టు ఎక్కారు. కిందకు వస్తుండగా లిఫ్టు వైరు తెగిపోయింది. దీంతో లిఫ్టు వేగంగా కిందపడిపోయింది. లోపల ఉన్న హోంమంత్రి కూడా లిఫ్టులో కిందపడిపోయారు. ఆయనతో పాటూ కానిస్టేబుల్, ఫోటోగ్రాఫర్ కూడా కిందపడి గాయపడ్డారు. చినరాజప్పకు నడుము భాగానికి గాయాలు కావడంతో సంజీవని ఆసుపత్రిలోనే ఐసీయూలో చేర్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.