యాప్నగరం

Chandrababu Naidu: సీఎం చంద్రబాబును కలిసిన మాజీ డీజీపీ సాంబశివరావు

ఏపీ సీఎం చంద్రబాబును మాజీ డీజీపీ సాంబశివరావు కలిశారు. ఉదయం అమరావతి వెళ్లిన సాంబశివరావు సీఎంతో అరగంటకుపైగా భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ డీజీపీ.. గంగవరం పోర్టు, సాగరమాల ప్రాజెక్టుకు సంబంధించి అంశాలపై సీఎంతో చర్చించినట్లు చెప్పారు.

Samayam Telugu 28 Aug 2018, 3:22 pm
ఏపీ సీఎం చంద్రబాబును మాజీ డీజీపీ సాంబశివరావు కలిశారు. ఉదయం అమరావతి వెళ్లిన సాంబశివరావు సీఎంతో అరగంటకుపైగా భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ డీజీపీ.. గంగవరం పోర్టు, సాగరమాల ప్రాజెక్టుకు సంబంధించి అంశాలపై సీఎంతో చర్చించినట్లు చెప్పారు. అలాగే నామినేటెడ్‌ పదవిపై ఎలాంటి ఆలోచన చేయలేదన్నారు సాంబశివరావు. సీఎంతో భేటీలో ఎలాంటి రాజకీయ అంశాలు ప్రస్తావనకు రాలేదన్నారు. ఇటీవల జగన్‌ను కలిసిన అంశం ప్రస్తావనకు రాగా.. దానిపైనా స్పందించారు.
Samayam Telugu Ex Dgp


తాను రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్నారు సాంబశివరావు. తాను ఏ పార్టీలో చేరడం లేదని.. ఎన్నికల్లో పోటీచేసే శక్తి కూడా లేదన్నారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ సీపీగా ఉండి మర్యాదపూర్వకంగా కలిశానన్న సాంబశివరావు.. ఇప్పుడు గంగవరం పోర్టు వద్దకు వచ్చినప్పుడు జగన్‌ను మర్యాదపూర్వకంగానే కలిశానని చెప్పారు. సమన్వయ లోపం వల్లే వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటన చేసి ఉండొచ్చని.. ప్రజలకు సేవ చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయన్నారు.

మూడు రోజుల క్రితం సాంబశివరావు విశాఖ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత జగన్‌ను కలిశారు. ఇద్దరు అరగంటకుపైగా సమావేశమయ్యారు. ఆ వెంటనే ఎంపీ విజయసాయిరెడ్డి సాంబశివరావు వైసీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. పార్టీకి ఆయన విలువైన సూచనలు తీసుకుంటామనడంతో.. ఆయన వైసీపీలో చేరడం ఖాయమనే ప్రచారం జరిగింది. కాని సాంబశివరావు విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనలో నిజం లేదన్నారు. జగన్‌ని కలిసి వారం కూడా గడవక ముందే మళ్లీ సాంబశివరావు సీఎం చంద్రబాబును కలవడం ఆసక్తిగా మారగా.. ఈ భేటీ రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమయ్యింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.