యాప్నగరం

జగన్‌తో మాజీ డీజీపీ భేటీ.. మతలబు ఏంటి?

విపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు కలవడం హాట్ టాపిక్‌గా మారింది. విశాఖ జిల్లాలో ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న జగన్‌ను శనివారం (ఆగస్టు 25) అచ్యుతాపురంలో సాంబశివరావు కలిశారు.

Samayam Telugu 25 Aug 2018, 7:21 pm
విపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు కలవడం హాట్ టాపిక్‌గా మారింది. విశాఖ జిల్లాలో ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న జగన్‌ను శనివారం (ఆగస్టు 25) అచ్యుతాపురంలో సాంబశివరావు కలిశారు. జగన్‌కు పుష్పగుచ్ఛం అందించి ఆప్యాయంగా పలకరించిన ఆయన ఆయనతో సుమారు 20 నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం సాంబశివరావును ఎంపీ విజయసాయి రెడ్డి, ఎమ్మెల్యే కన్నబాబు దగ్గరుండి కారెక్కించారు.
Samayam Telugu jagan


జగన్‌తో సాంబశివరావు భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయి రెడ్డి.. మాజీ డీజీపీ వైసీపీలో చేరుతున్నారని తెలిపారు. ఆయన తమ పార్టీలో చేరడం శుభపరిణామం అన్నారు. సాంబశివరావు సలహాలు, సూచనలు తీసుకుంటామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.