ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్గా కొనసాగుతూ ప్రభుత్వం, చంద్రబాబుకు వ్యతిరేకంగా మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేసి, మరికొన్నింటిని షేర్ చేయడంతో పెద్ద దూమారమే చెలరేగింది. దీంతో బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి నుంచి ఆయనను ప్రభుత్వం తప్పించింది. దీనిపై గుంటూరు ఎంపీ, తెలుగుదేశం నేత రాయపాటి సాంబశివరావు అతనిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తనకు ప్రకాశం జిల్లా దొనకొండలో ఎలాంటి భూములూ లేవని, ఈ విషయంలో తెలుగుదేశం నేత రాయపాటి సాంబశివరావు చేసిన ఆరోపణలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్యానించారు. దమ్ముంటే రాయపాటి తనపై చేసిన ఆరోపణల నిజానిజాలను విచారణ జరిపించి తేల్చాలని సవాల్ విసిరారు.
తనకు భూములున్నట్టు రాయపాటి మాట్లాడటం హాస్యాస్పదమని, అబద్ధాలు చెప్పడం, దాన్ని నిజం చేయాలని అనుకోవడం టీడీపీ నేతలకు అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ కు రూ. 500 కోట్ల కేటాయిస్తామని ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన తెలుగుదేశం పార్టీ, ఆ హామీలను విస్మరించిందని అన్నారు. దీనిపై గట్టిగా అడిగినా కూడా ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. ముద్రగడ ఉద్యమానికి దిగిన తరువాతనే కాపులకు నామమాత్రంగా నిధులిచ్చారని ఐవైఆర్ దుయ్యబట్టారు.
దీనిపై బ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ మాజీ చైర్మన్ కృష్ణారావు బుధవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కలిశారు. సోషల్ మీడియాలో తనపై పెట్టిన అభ్యంతకర పోస్టులపై ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు. ఫేస్బుక్లో ఐవైఆర్ షేర్ చేసిన పోస్ట్లు, తదనంతర పరిణామాలపై కూడా ఆయన గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లారు. అయితే గవర్నర్ కూడా ఐవైఆర్నే మందలించినట్లు సమాచారం.
తనకు భూములున్నట్టు రాయపాటి మాట్లాడటం హాస్యాస్పదమని, అబద్ధాలు చెప్పడం, దాన్ని నిజం చేయాలని అనుకోవడం టీడీపీ నేతలకు అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ కు రూ. 500 కోట్ల కేటాయిస్తామని ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన తెలుగుదేశం పార్టీ, ఆ హామీలను విస్మరించిందని అన్నారు. దీనిపై గట్టిగా అడిగినా కూడా ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. ముద్రగడ ఉద్యమానికి దిగిన తరువాతనే కాపులకు నామమాత్రంగా నిధులిచ్చారని ఐవైఆర్ దుయ్యబట్టారు.
దీనిపై బ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ మాజీ చైర్మన్ కృష్ణారావు బుధవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కలిశారు. సోషల్ మీడియాలో తనపై పెట్టిన అభ్యంతకర పోస్టులపై ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు. ఫేస్బుక్లో ఐవైఆర్ షేర్ చేసిన పోస్ట్లు, తదనంతర పరిణామాలపై కూడా ఆయన గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లారు. అయితే గవర్నర్ కూడా ఐవైఆర్నే మందలించినట్లు సమాచారం.